Pension of Rs 3,000 per month for farmers .. Registrations begin!
రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్.. రిజిస్ట్రేషన్స్ ప్రారంభం!
రైతులకు తీపికబురు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నదాతల కోసం పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది. దీని పేరు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన స్కీమ్. ఈ స్కీమ్లో చేరిన రైతులు నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
రైతులకు తీపికబురు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అన్నదాతల కోసం పెన్షన్ స్కీమ్ను ప్రారంభించింది. దీని పేరు ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన స్కీమ్. ఈ స్కీమ్లో చేరిన రైతులు నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
ప్రధానాంశాలు:
- పీఎం-కేఎంవై స్కీమ్ ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం
- 2 హెక్టార్లలోపు భూమి కలిగిన రైతులు ఈ స్కీమ్లో చేరొచ్చు
- భార్యభర్తలిద్దరికీ పథకంలో చేరే అవకాశం
- కామన్ సర్వీస్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చు
రైతులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన (పీఎం-కేఎంవై)
- స్కీమ్ రిజిస్ట్రేషన్స్ను ప్రారంభించింది. ఈ పథకంలో నమోదు చేసుకోవడం వల్ల రైతులు 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందొచ్చు.
- ‘దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి పీఎం-కేఎంవై రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు 418 మంది రైతులు ఈ స్కీమ్ కింద పేరు నమోదు చేసుకున్నారు.
- రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.
- జమ్మూ అండ్ కశ్మీర్ సహా దేశవ్యాప్తంగా ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది
- ఎంత కష్టపడుతున్నా కూడా రైతులకు సరైన ఆదాయం లభించడం లేదు. అందువల్ల వారి సామాజిక భత్రతా చాలా ముఖ్యం.
- అన్నదాత ఆదాయం పెంపునకు పలు చర్యలు తీసుకున్నాం. పీఎం-కేఎంవై కూడా ఇందులో ఒక భాగమే’ అని తోమర్ తెలిపారు.
2 హెక్టార్ల వరకు భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హలు.
- ఇది వాలంటరీ క్రంటిబ్యూషన్ ఆధారిత పెన్షన్ స్కీమ్. 18 నుంచి 40 ఏళ్లలోపు వారు ఈ స్కీమ్లో చేరొచ్చు.
- కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నమోదు ఉచితం.
- అయితే సీఎస్సీ సెంటర్లు రూ.30 వసూలు చేస్తాయి. అయితే కేంద్ర ప్రభుత్వమే ఈ డబ్బు చెల్లిస్తుంది.
- రైతులు నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది.
- వయసు ప్రాతిపదికన చెల్లించే మొత్తం మారుతుంది. రైతులు చెల్లించే మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా పెన్షన్ ఫండ్కు చెల్లిస్తుంది.
- భర్యభర్తలిద్దరూ విడివిడిగా చెల్లించి విడివిడిగా పెన్షన్ పొందొచ్చు.
- స్కీమ్లో చేరినవారు రిటైర్మెంట్కు ముందుగానే మరణిస్తే చెల్లించిన మొత్తాన్ని వడ్డీతోపాటు తిరిగి చెల్లిస్తారు
- నామినీకి ఈ మొత్తం అందుతుంది.
- లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) పెన్షన్ ఫండ్ను నిర్వహిస్తుంది.
0 Response to "Pension of Rs 3,000 per month for farmers .. Registrations begin!"
Post a Comment