Teachers ... Adjustment is not easy
ఉపాధ్యాయుల... సర్దుబాటు తేలేదెలా!
● ఆగస్టు ఒకటి తర్వాత ప్రవేశాల సంగతేమిటి?
● ఛైల్డ్ఇన్ఫోకు ఎక్కని పిల్లల సమాచారం
● సెకండరీగ్రేడ్లోనే 180 మంది మిగులు టీచర్లు
● 600కు పైగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల ఆవశ్యకత
ఈనాడు, గుంటూరు: జిల్లాలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టడానికి జిల్లా విద్యాశాఖకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక యంత్రాంగం సతమతమవుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న ప్రవేశాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమనుకుంటే మిగులు ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు డిప్యుటేషన్పై పంపాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశించారు. ఈ నెల 14న ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో పిల్లల సంఖ్య, మిగులు ఉపాధ్యాయుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి దాకా జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న పిల్లలు, వారి సంఖ్య ఆధారంగా ఉన్న మిగులు ఉపాధ్యాయులను గుర్తించటానికి తొలుత తమకు వాస్తవ ప్రవేశాల లెక్కలు తేలటం లేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి విద్యార్థి ప్రవేశాన్ని చైల్డ్ ఇన్ఫో డేటాకు అనుసంధానించాలి. ఇది పూర్తిగా ఆధార్ ప్రాతిపదిక డేటా. బయోమెట్రిక్ యంత్రాలు చాలా మంది పిల్లల కనురెప్పలు, వేలిముద్రలను స్వీకరించటం లేదు. దీంతో వాస్తవంగా ఛైల్డ్ ఇన్ఫో డేటాకు, వాస్తవంగా పాఠశాల ప్రవేశాల రిజిస్టర్లో ఉన్న సంఖ్యకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా ఛైల్డు ఇన్ఫో డేటా ఆధారంగానే మిగులు ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించటంతో ఈ ప్రక్రియ నిర్వహణలో ఎలా ముందుకెళ్లాలో తెలియటం లేదని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పష్టతను ఇవ్వాలని కోరామని, వారి నుంచి స్పందన లేదంటున్నారు. పాఠశాల ప్రవేశాల రిజిస్టర్ల ఆధారంగా అయితే పిల్లల సంఖ్య పెరుగుతారు. అదే ఛైల్డ్ఇన్ఫో డేటా అయితే తక్కువ మంది ఉంటారని, చాలా మంది పిల్లల కనురెప్పలు చిత్రీకరించే పరిస్థితి లేకపోవటంతో వారి వివరాలను మాన్యువల్గా చూపాల్సి వస్తోందని గుర్తు చేశారు.
● ఆగస్టు ఒకటి తర్వాత ప్రవేశాల సంగతేమిటి?
● ఛైల్డ్ఇన్ఫోకు ఎక్కని పిల్లల సమాచారం
● సెకండరీగ్రేడ్లోనే 180 మంది మిగులు టీచర్లు
● 600కు పైగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల ఆవశ్యకత
ఈనాడు, గుంటూరు: జిల్లాలో ఉపాధ్యాయుల పని సర్దుబాటు ప్రక్రియ చేపట్టడానికి జిల్లా విద్యాశాఖకు అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. దీంతో దీన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక యంత్రాంగం సతమతమవుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న ప్రవేశాల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయుల లెక్కలు తేల్చాలని ప్రభుత్వం ఆదేశించింది. అవసరమనుకుంటే మిగులు ఉపాధ్యాయులను ఆయా పాఠశాలలకు డిప్యుటేషన్పై పంపాలని స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియను ఈ నెల 20 నాటికి పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశించారు. ఈ నెల 14న ప్రతి పాఠశాల నోటీసు బోర్డులో పిల్లల సంఖ్య, మిగులు ఉపాధ్యాయుల వివరాలను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటి దాకా జిల్లాలో ఆగస్టు ఒకటో తేదీ నాటికి ఉన్న పిల్లలు, వారి సంఖ్య ఆధారంగా ఉన్న మిగులు ఉపాధ్యాయులను గుర్తించటానికి తొలుత తమకు వాస్తవ ప్రవేశాల లెక్కలు తేలటం లేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి విద్యార్థి ప్రవేశాన్ని చైల్డ్ ఇన్ఫో డేటాకు అనుసంధానించాలి. ఇది పూర్తిగా ఆధార్ ప్రాతిపదిక డేటా. బయోమెట్రిక్ యంత్రాలు చాలా మంది పిల్లల కనురెప్పలు, వేలిముద్రలను స్వీకరించటం లేదు. దీంతో వాస్తవంగా ఛైల్డ్ ఇన్ఫో డేటాకు, వాస్తవంగా పాఠశాల ప్రవేశాల రిజిస్టర్లో ఉన్న సంఖ్యకు పొంతన ఉండడం లేదు. ప్రభుత్వం మాత్రం తప్పనిసరిగా ఛైల్డు ఇన్ఫో డేటా ఆధారంగానే మిగులు ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించటంతో ఈ ప్రక్రియ నిర్వహణలో ఎలా ముందుకెళ్లాలో తెలియటం లేదని విద్యాశాఖవర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి స్పష్టతను ఇవ్వాలని కోరామని, వారి నుంచి స్పందన లేదంటున్నారు. పాఠశాల ప్రవేశాల రిజిస్టర్ల ఆధారంగా అయితే పిల్లల సంఖ్య పెరుగుతారు. అదే ఛైల్డ్ఇన్ఫో డేటా అయితే తక్కువ మంది ఉంటారని, చాలా మంది పిల్లల కనురెప్పలు చిత్రీకరించే పరిస్థితి లేకపోవటంతో వారి వివరాలను మాన్యువల్గా చూపాల్సి వస్తోందని గుర్తు చేశారు.
0 Response to "Teachers ... Adjustment is not easy"
Post a Comment