No political interference in PMC election
No political interference in PMC election
పీఎంసీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు.
ప్రభుత్వ , జడ్పి మున్సిపల్ , ఎయిడెడ్ పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పేరెంట్స్ మోనటరింగ్ కమిటీ ( పీఎంసీ ) లకు నిర్వహించే ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని , ఆ మేరకు ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం జరిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి చినవీరభద్రుడు హెచ్చ రించారు . స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ( ఎస్ఎంసీ ) ల స్తానే పేరు మార్పుతో కొత్తగా ఈ నెల 23న పీఎంసీలకు నిర్వహిం చనున్న ఎన్నికలపై సోమవారం ఎస్ఎస్ఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు . ఎస్డీడీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచ నలు చేశారు . ప్రతి తరగతికి ముగ్గురు తల్లిదండ్రులతో కూడిన సభ్యులు పీఎంసీలో ఉండాల్సిందేనని అన్నారు . ఈ నెల 19వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ , ఓటర్ల జాబితాను స్కూల్ నోటీసు బోర్డులోను , పంచాయతీ గోడపైన , బహిరంగ ప్రదేశా ల్లోను ప్రదర్శనకు పెట్టాలని ఆదేశించారు .
ఎన్నికల పరిశీలకు లుగా తహసీల్దార్ , ఎంపీడీవో , వీఏవో , వీఆర్వోలు వ్యవహరిస్తారని , వీరి నియామకాలకు సంబంధించి కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు . అలాగే ఎన్ని కలను పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు . విద్యార్థి తల్లి / తండ్రి / సంరక్షకులలో ఎవరైనా ఒకరికి ఓటుహక్కు ఉంటుం దని , ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీరు రేషన్ కార్డు / ఆధార్ కార్డు / డ్రైవింగ్ లైసెన్సు / ఓటరు ఐడి / ప్రభు త్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డులలో ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు . పేరెంట్ కాని వారు ఎక్కడైనా పీఎంసీ కి ఎన్నికైతే సంబంధిత స్కూలు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తప్పవన్నారు . పీఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్కూలు హెచ్ఎం , టీచర్ , ఏఎన్ఎం , డ్వాక్రా సంఘ మండల అధ్యక్షురాలు , అంగన్ వాడీ వర్కర్ , వార్డు మెంబరు ఉంటారని వివరించారు . పీఎంసీ ఎన్నికలను హైస్కూళ్ళకు కూడా నిర్వహించాలని ఆదేశించారు . వీడియో కాన్ఫరెన్సులో ఎస్ఎస్ఏ పీవో ఎం . కాత్యాయని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు .
పీఎంసీ ఎన్నికల్లో రాజకీయ జోక్యం వద్దు.
ప్రభుత్వ , జడ్పి మున్సిపల్ , ఎయిడెడ్ పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న పేరెంట్స్ మోనటరింగ్ కమిటీ ( పీఎంసీ ) లకు నిర్వహించే ఎన్నికల్లో రాజకీయ జోక్యం లేకుండా చర్యలు తీసుకోవాలని , ఆ మేరకు ఎన్నికల ప్రక్రియలో రాజకీయ జోక్యం జరిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సర్వశిక్షా అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు అధికారి చినవీరభద్రుడు హెచ్చ రించారు . స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ( ఎస్ఎంసీ ) ల స్తానే పేరు మార్పుతో కొత్తగా ఈ నెల 23న పీఎంసీలకు నిర్వహిం చనున్న ఎన్నికలపై సోమవారం ఎస్ఎస్ఏ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు . ఎస్డీడీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచ నలు చేశారు . ప్రతి తరగతికి ముగ్గురు తల్లిదండ్రులతో కూడిన సభ్యులు పీఎంసీలో ఉండాల్సిందేనని అన్నారు . ఈ నెల 19వ తేదీ వరకు ఎన్నికల నోటిఫికేషన్ , ఓటర్ల జాబితాను స్కూల్ నోటీసు బోర్డులోను , పంచాయతీ గోడపైన , బహిరంగ ప్రదేశా ల్లోను ప్రదర్శనకు పెట్టాలని ఆదేశించారు .
ఎన్నికల పరిశీలకు లుగా తహసీల్దార్ , ఎంపీడీవో , వీఏవో , వీఆర్వోలు వ్యవహరిస్తారని , వీరి నియామకాలకు సంబంధించి కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని కోరారు . అలాగే ఎన్ని కలను పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించేందుకు జిల్లా ఎస్పీ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు . విద్యార్థి తల్లి / తండ్రి / సంరక్షకులలో ఎవరైనా ఒకరికి ఓటుహక్కు ఉంటుం దని , ఓటుహక్కు వినియోగించుకునేందుకు వీరు రేషన్ కార్డు / ఆధార్ కార్డు / డ్రైవింగ్ లైసెన్సు / ఓటరు ఐడి / ప్రభు త్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డులలో ఒకటి చూపించాల్సి ఉంటుందన్నారు . పేరెంట్ కాని వారు ఎక్కడైనా పీఎంసీ కి ఎన్నికైతే సంబంధిత స్కూలు ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తప్పవన్నారు . పీఎంసీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా స్కూలు హెచ్ఎం , టీచర్ , ఏఎన్ఎం , డ్వాక్రా సంఘ మండల అధ్యక్షురాలు , అంగన్ వాడీ వర్కర్ , వార్డు మెంబరు ఉంటారని వివరించారు . పీఎంసీ ఎన్నికలను హైస్కూళ్ళకు కూడా నిర్వహించాలని ఆదేశించారు . వీడియో కాన్ఫరెన్సులో ఎస్ఎస్ఏ పీవో ఎం . కాత్యాయని ప్రసన్న తదితరులు పాల్గొన్నారు .
0 Response to "No political interference in PMC election"
Post a Comment