Amma vadi
బియ్యం పత్రం.. (Ration Card)మార్పులకు కష్టం
తల్లిదండ్రుల్లో అమ్మఒడి గుబులు
ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు బియ్యం పత్రమే ఆధారం. దీని ఆధారంగానే కుటుంబాన్ని గుర్తిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారి వివరాలు తొలగించి కొత్తగా పత్రం తీసుకోవడానికి కొన్నాళ్లుగా అవకాశం లేదు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందిపడుతున్నారు. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్నా సాంకేతికంగా కార్డు నుంచి విడిపోయి కొత్తగా పత్రం తీసుకోకపోవడంతో అనర్హులవుతున్నారు. దాదాపు 66 రోజుల నుంచి కార్డుల్లో మార్పులు, చేర్పులు, బదిలీలకు అవకాశం లేకుండాపోయింది. వీటికి సంబంధించిన సేవలు మీసేవ కేంద్రంలో అందుబాటులో లేవు. ఫలితంగా లబ్ధిదారులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో చెప్పలేకపోవడంతో లబ్ధిదారులకు కష్టాలు తప్పటంలేదు.
పాఠశాలల్లో విద్యార్థులను ఆధార్ కార్డు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. దీంతో చాలా మంది పిల్లల పేర్లు బియ్యం పత్రాల్లో నమోదు చేయించలేదు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల పేర్లు బియ్యం పత్రంలో నమోదైతేనే అమ్మఒడి పథకానికి అర్హులవుతారు. ● వివిధ కారణాలతో ఇప్పటి వరకు కార్డుల్లో పిల్లల పేర్లు నమోదు చేయించుకోని వారు ప్రస్తుతం మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు సేవలు నిలిపివేశారని చెప్పడంతో రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నారు. రేషన్కార్డులు పౌరసరఫరాల శాఖ వారు జారీ చేసినందున అక్కడికి వెళ్లాలని సూచిస్తున్నారు. కార్డుదారులకు ఎక్కడా సరైన సమాధానం లభించకపోవడం, సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియకపోవటంతో అయోమయానికి గురవుతున్నారు.
అమ్మఒడి పథకం జనవరి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో బియ్యం పత్రంలో తమ పిల్లల పేర్లు చేర్చుకోవడానికి లబ్ధిదారులు ఆత్రుత చూపుతున్నారు. సేవలు పునరుద్ధరించని పక్షంలో బియ్యం పత్రం యూనిట్గా పథకం అమలు చేస్తున్నందున అర్హత కోల్పోయే అవకాశం ఉంది.
0 Response to "Amma vadi"
Post a Comment