Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For tenth grade students Morning Tiffin. . Evening snacks

‘ పది ’ విద్యార్థులకు ఉదయం టిఫిన్ . . సాయంత్రం స్నాక్స్ 
For tenth grade students Morning Tiffin. . Evening snacks

ప్రభుత్వ , జెడ్పీ స్కూళ్లలో మాత్రమే
 నవంబరు మొదటి వారంలో తుది నిర్ణయం 
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత కోసం 
కర్నూల్ న్యూస్
ప్రత్యేక తరగతులు నిర్వహించే సమయంలో విద్యార్థులకు ఉదయం టిఫిన్ , సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ నిర్ణయించారు . హాస్టల్స్ , కస్తూర్బా , ఏపీ మోడల్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులు మినహా మిగిలిన ప్రభుత్వ , జెడ్పీ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్లలో పదో తరగతి విద్యార్థులకు వీటిని అందించనున్నారు . ఇందుకు ఒక్కో విద్యార్థికి 20 రూపాయలు ఖర్చు చేసేందుకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు . ఉదయం టిఫిన్ ఒక్కో విద్యార్థికి రూ . 15 , సాయంత్రం స్నాకకు రూ . 5గా నిర్ణయించారు . స్నాక్స్ లో రెండు ఆరటి పండ్లు కానీ , బిస్కెట్స్ కానీ ఇవ్వాలని నిర్ణయించారు . గత విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో జిల్లా 12వ స్థానంలో ఉంది . దీంతో కలెక్టర్ వీరపాండియ న్ . . విద్యాశాఖ అధికారులకు ఒక లక్ష్యం నిర్ణ యించారు . అయితే ప్రత్యేక తరగతులకు విద్యా ర్థులు హాజరయ్యేందుకు ఇబ్బందులు పడుతున్నారని , ఉదయం , సాయంత్రం టిఫిన్ , స్నాక్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుదని టీచర్లు సూచనలు చేయడంతో కలెక్టర్ దీనిపై స్పందించారు . టిఫిన్ , స్నాకు ప్రత్యేకంగా నిధులు - మంజూరు చేస్తామని , ఇందుకు ఒక నిర్దిష్టమైన - ప్రణాళికతో రావాలని , డీఈఓ , డీసీఈబీ అధికా రులకు సూచించారు . 

75 రోజుల పాటు టిఫిన్ , స్నాక్స్ . . - 

జిల్లాలో పదో తరగతి పరీక్షలకు అన్ని యాజ మాన్యాలకు చెందిన విద్యార్థులు 45 వేల నుంచి 50 వేల మంది హాజరవుతున్నారు . వీరిలో ప్రభుత్వ , జిల్లా పరిషత్ యాజమాన్యాలకు చెందిన హైస్కూళ్ల విద్యార్థులు సుమారుగా 26 వేల మంది ఉండొచ్చని అంచనా . వీరిలో ఎఫ్ ఏ - 1 , ఎస్ఎ - 2 , స్పెషల్ టెస్ట్ ఆధారంగా వచ్చిన మార్కులను బట్టి విద్యార్థులను ఏ , బీ , సీ , డీ గ్రూప్లుగా విభజించారు . ఇందులో సీ , డీ కేటగిరిలకు చెందిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు . వంద శాతం ఫలితాల సాధన కోసం 75 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి , ప్రతి రోజూ ఉదయం , సాయంత్రం టిఫిన్ ఏర్పాటు చేస్తే రూ . 3 . 90 కోట్లు ఖర్చు అవుతుందని విద్యాశాఖ అధికా రులు అంచనా వేశారు . ఈ విషయంపై నవం బరు 2వ తేదీన గానీ , నవంబర్ మొదటి వారంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For tenth grade students Morning Tiffin. . Evening snacks"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0