ప్రతి సంవత్సరం జనవరిలో డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ.
*అందరి సహకారంతో పాఠశాలలు బలోపేతం..*
* విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి..*
( పాఠశా లల బలోపేతానికి అందరి సహకారం అవస రమని విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ తెపాపారు . విద్యావ్యవస్థ అభివృద్ధిలో చేస్తున్న మార్పుల్లో భాగస్వామ్యం కావాల న్నారు . అయితే అలసత్వాన్ని సహించేది లేదని తెలిపారు . కలెక్టరేట్ సభాభవనంలో శనివారం డీఈఓ శైలజ అధ్యక్షతన ' ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి నాడు - నేడు పై విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాణ్యతా విలువలతో కూడిన విద్యను ఒకటో తరగతి నుంచే అందించాలని విద్యాశాఖాధికారులను ఆదేశించారు . ప్రభుత్వం సూచించే ఆదేశాలను అమలు చేసే బాధ్యత క్షేత్రస్థాయి అధికారులదేనని చెప్పారు . విద్యావ్యవస్థను గాడిలో పెట్టి విలు వలతో కూడిన విద్య అందించాలన్నదే సీఎం ప్రధాన ఉద్దేశ్యమన్నారు . విద్యా నవరత్నాల అంశాలు విద్యాశాఖకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో ఉంచాలన్నారు . ఆమ్మ ఒడి , నాడు నేడు రెగ్యులేటరీ కమిషన్ ఇలా వినూ త్నమైన ఆలోచనలతో ముఖ్యమంత్రి ముందుకు వెళుతున్నారన్నారు . విద్యా ప్రమా ణాలను పెంచి భావితరాలకు ఉత్తమ పౌరు లను తీర్చిదిద్దే శక్తి ఉపాధ్యాయులకే ఉంద న్నారు .
అన్ని మౌలిక అంశాలు మెరుగుపరుస్తూ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు . పేరెంట్స్ కమిటీలను ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలిపారు . జిల్లాలో మధ్యాహ్న భోజనం అందించేందుకు కేంద్రీకృత కిచెన్ ఏర్పాటు చేసేందుకు రెండెక రాల స్థలం కావాలని కలెక్టరు సహకారంతో గుర్తించాలని డీఈఓను ఆదేశించారు . పాఠశా లల్లో నోబ్యాగ్ డే తప్పనిసరిగా పాటించాల న్నారు . ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ మాట్లా డుతూ ఒకటో తరగతి నుంచే విద్యార్థుల్లో అభ్యసనా ప్రమాణాలు పెంచాలన్నారు . చదు వులో వెనుకబడిన వారిని గుర్తించి వారిని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలన్నారు . దేశంలో ఎక్కడా లేని విధంగా విశ్రాంత జడ్డి నేతృత్వంలో రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు . కలెక్టరు హరికిరణ్ మాట్లా డుతూ జిల్లాలో 86 శాతం మంది పిల్లలకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామన్నారు . జిల్లాలో 2 . 50 లక్షల మంది తల్లులు అమ్మఒడి పథకం ద్వారా లబ్ధి పొందనున్నారన్నారు . కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రవీంద్రనాదరెడ్డి , వెంకటసుబ్బయ్య , ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి , ఇంటర్మీడియట్ ఆర్జేడీ చంద్రశేఖర్ రెడ్డి , పాఠశాల విద్య ఆర్జేడీ క్రిష్ణారెడ్డి , వైవీయూ అధికారులు పాల్గొన్నారు .
ట్రిపుల్ ఐటీలను అగ్రగామిగా తీర్చిదిద్దుతాం
ట్రిపుల్ ఐటీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో అగ్రగామిగా తీర్చిది ద్దుతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆది మూలపు సురేష్ తెలిపారు . ఇడుపులపాయ ట్రిపుల్ఐటీని శనివారం సాయంత్రం మంత్రి సురేష్ సందర్శించారు . డైరెక్టర్ సుదర్శన్ రావు , ఏఓ రత్నకుమారి , ఇతర అధికారులు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం ప లికారు . క్యాంపస్ ఆవరణంలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు . మొక్కలు నాటారు . అనంతరం ట్రిపుల్ ఐటీలో ఎస్సీ , ఎస్టీ సెల్ ను ప్రారంభిం చారు . మొదట విలేకరుల సమావేశంలోను తర్వాత సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులు , అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు . - జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ ను సందర్శించారు . శనివారం సాయంత్రం వైఎస్ సమాధి వద్ద పూలమాల వేసి నివాళులు అర్పించారు . కాసేపు కూర్చొని మౌనం పాటిం చారు . వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి గుర్తుచేసుకున్నారు .
0 Response to "Posts are replaced by DSC in January every year."
Post a Comment