Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

These are the Cabinet decisions ...


    ఏపీ కేబినెట్‌*
 ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.

*కేబినెట్ నిర్ణయాలు ఇవే...*
  • వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రతిష్టాత్మకమైన ‘అమ్మ ఒడి’ పథకానికి కేటినెట్‌ ఆమోదం.*
  • .
These are the Cabinet decisions ...


ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయాలు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం జరిగింది. దాదాపు నాలుగు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రివర్గ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు.


కేబినెట్‌ నిర్ణయాలివే..


  •  1 నుంచి 12 వరకు చదివే విద్యార్థులకు అమ్మ ఒడి పథకం వర్తింపు. 
  • విద్యార్థుల తల్లులు లేదా వారి సంరక్షులకు అందజేసేందుకు మంత్రివర్గం ఆమోదం. 
  • ఏటా జనవరిలో ఈ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ.
  •  గర్భవతులు, బాలింతలు, ఆరునెలల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు అదనపు పౌష్ఠికాహారం అందించాలని నిర్ణయం. 
  • గుర్తించిన 77 మండలాల్లో  ఈ పథకం అమలు.
  • కృష్ణా, గోదావరి కాల్వల శుభ్రం చేసేందుకు శుద్ధి మిషన్‌ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం.
  •  సీఎం ఛైర్మన్‌గా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైస్‌ ఛైర్మన్‌గా మిషన్‌ ఏర్పాటు.
  •  షెడ్యూల్డు కులాల కార్పొరేషన్‌ను మూడుగా విభజించాలని నిర్ణయం. 
  • మాల ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, మాదిగ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌, రెల్లి, ఇతరకులాల కార్పొరేషన్‌గా విభజించేందుకు కేబినెట్‌ ఆమోదం.
  • వివిధ రంగాల ద్వారా ప్రజాసేవచేసేవారికి  వైఎస్సార్‌ లైఫ్‌టైం అవార్డు అందించాలని మంత్రివర్గం నిర్ణయం.
  •  విద్య, సామాజిక సేవ, వైద్యం, ఇంజినీరింగ్‌, వాణిజ్యం, పరిశ్రమలు, సాహిత్యం, కళలు, క్రీడా రంగాల్లో విజయాలు సాధించి సమాజహితం కోసం కృషి చేసిన వారిని గుర్తించాలని నిర్ణయం. 
  • ఏటా జనవరి 26న 50 మందిని, ఆగస్టు 15న 50మందిని ఎంపిక చేసి ఈ అవార్డు అందించేందుక కేబినెట్‌ ఆమోదం. 
  • ఈ అవార్డు కింద రూ.10లక్షల నగదు అందజేతకు నిర్ణయం.
  •  హజ్‌, జెరూసలేం వెళ్లే యాత్రికులకు ఇస్తున్న ఆర్థిక సాయాం పెంచేందుకు కేబినెట్‌ నిర్ణయం.
  •  రూ.3లక్షల లోపు ఆదాయం నుంచి ఉన్నవారికి  ప్రస్తుతం ఉన్న రూ.40వేల నుంచి రూ.60వేలకు పెంపు. 
  • రూ.3లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారికి రూ. 20వేల నుంచి రూ.30వేలకు పెంచాలని నిర్ణయం.
  •  స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్లు గుర్తించి ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయం. 
  • ప్రభుత్వం జీవో ఇచ్చిన ఆరు నెలలోపు కంకర నుంచి రోబో శాండ్‌ తయారు చేయటానికి రూ.50లక్షల నుంచి రూ.1.50 కోట్లకు వరకూ పావలా వడ్డీకే రుణాలు అందించాలనే నిర్ణయానికి ఆమోదం.  
  • ప్రభుత్వ నిర్మాణాలకు 50 కిలోమీటర్ల లోపు ఉన్న స్టోన్‌ క్రషింగ్‌ యూనిట్ల నుంచి 20 శాతం రోబో శాండ్‌ తప్పని సరిగా వినియోగించాలని నిర్ణయం.
  • అభ్యంతరంలేని ప్రభుత్వ భూమిలో ఉన్న ఆక్రమణలను 300 గజాల వరకు రెగ్యులరైజ్‌ చేయాలని నిర్ణయం.
  •  తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండి 100 గజాల్లో  ఇల్లు నిర్మించి ఉంటే ఒక్క రూపాయికే రిజిస్ట్రేషన్‌.
  •  100 గజాలు నుంచి 300 గజాల వరకు  ఉన్న ఆక్రమణలకు మార్కెట్‌ ధరను జిల్లా కలెక్టర్లు నిర్ణయించి రెగ్యులరైజ్‌ చేసేందుకు ఆమోదం. 
  • ఆ స్థలాలకు ఐదేళ్ల వరకు లాకింగ్‌ పిరియడ్‌. ఆ తర్వాత లబ్ధిదారులకు యాజమాన్య హక్కులు. 
  • గతంలో పేదలకు ఇచ్చిన  స్థలాలను మరొక పేదవారు కొనుగోలు చేస్తే వారి తరఫున కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయం.
  •  గ్రామీణ, వార్డు స్థాయిలో 397 అదనపు జేఎల్‌ఎం పోస్టులకు మంత్రివర్గం ఆమోదం.
  •  గత ప్రభుత్వాల దోష నిర్ణయాల వల్ల ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ఉపశమనం కల్పించేందుకు డిస్కంల నిధుల కోసం బాండ్ల జారీకి కేబినెట్‌ ఆమోదముద్ర.
  • హోంశాఖలో అదనపు పోస్టుల భర్తీకి ఆమోదం.
  •  రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సాంకేతికంగా అండగా ఉండటానికి, సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించడానికి, రైతు నష్టాలు తగ్గించడానికి 147 గ్రామీణ నియోజకవవర్గాల్లో  వైఎస్‌ఆర్‌ ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లు  ఏర్పాటు. 
  • జిల్లా స్థాయిలో ఒక అగ్రి ల్యాబ్‌, నాలుగు ప్రాంతీయ కోడింగ్‌సెంటర్ల ఏర్పాటు. 
  • నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసే అగ్రిల్యాబ్‌ల ద్వారా ఎరువులు, పురుగుమందులు, విత్తనాల నాణ్యత తెలుసుకునేందుకు భూసార పరీక్షలు చేయించుకునేందుకు అవకాశం. 
  • 2020 మార్చి నుంచి అగ్రి ల్యాబ్‌లు ప్రారంభం. 
  • 46 నియోజకవర్గాల్లో అక్వాల్యాబ్‌లు ఏర్పాటుకు ఆమోదం.

  • నవంబర్‌ 7 నుంచి అగ్రిగోల్డ్‌ బాధితులందరికీ చెల్లింపులు ప్రారంభం. రూ.20వేల లోపు డిపాజిట్‌ దారులకు డబ్బులు చెల్లించేందుకు కేబినెట్‌ నిర్ణయం.
  •  దీనికోసం రూ.264 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదముద్ర. దీంతో 3,69,659 మంది బాధితులకు లబ్ధి.

  •             


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "These are the Cabinet decisions ... "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0