1 to 6 English Cabinet to take decision from next academic year
1నుంచి 6 వరకు ఇంగ్లిష్
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు.. కేబినెట్ నిర్ణయం
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలు
1 నుంచి 12వ తరగతి వరకూ తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరని నిబంధన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు.. కేబినెట్ నిర్ణయం
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మంత్రివర్గ భేటీలో పలు నిర్ణయాలు
1 నుంచి 12వ తరగతి వరకూ తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరని నిబంధన
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గ నిర్ణయాలను రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వివరించారు.
ముఖ్యమైన అంశాలు..
- ఇంగ్లిష్ మీడియంలో బోధనకు ఆమోద ముద్ర
- వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన, తెలుగు లేదా ఉర్దూ తప్పనిసరి సబ్జెక్టు చేయాలన్న నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతర మేధావుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- 12వ తరగతి వరకు ప్రతి ఒక్కరూ తెలుగు లేదా ఉర్దూను రెండో సబ్జెక్టుగా తప్పనిసరిగా చదవాలి.
- ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే 34% స్కూళ్లలో ఇంగ్లిషులోనే విద్యా బోధన జరుగుతుండగా.. మిగిలిన 66% స్కూళ్లలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టాలన్నదే సీఎం ఆలోచన.
0 Response to "1 to 6 English Cabinet to take decision from next academic year"
Post a Comment