Amma's scheme has finalized the rules
అమ్మఒడి ' చారిత్రాత్మక నిర్ణయం
పథకం అమలుకు కసరత్తు విద్యార్థులు , తల్లిదండ్రుల వివరాల సేకరణ
హామీల అమలులో దూసుకెళ్తున్న జగన్ ప్రభుత్వం ! ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
చదువుకు పేదరికం అడ్డురాకూడదని భావించిన సీఎం వైఎస్ . జగ న్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేయాలని నిశ్చయించారు . ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు . ప్రస్తుతం అమ్మఒడి పథకం విధివిధానాలను ఖరారు చేశారు . దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారు . ఈ పథకం అమలుపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు . తల్లుల ఖాతా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు .
రాను . . రాను కనుమరుగైపో తున్న సర్కారు విద్యను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే పేదరికంలో ఉన్న ప్రతి విద్యార్టీ బడికి వెళ్లాలి . బడిబయట పిల్లలు ఎక్కడా కనిపించకూడదు . చదువుకు పేదరికం అడ్డుకాకుడదని సీఎం వైఎస్ . జగ న్మో హన్ రెడ్డి బలంగా భావిస్తున్నారు . ఆం దుకే అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు . ప్రజాసంకల్ప యాత్రలో పేద విద్యార్థుల ఇబ్బందులు కళ్లారా చూసిన ఆయన అమ్మఒడి పథకాన్ని నవరత్నాల హామీలో పొందుపరిచారు . ఈ పథకం జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు . సమయం సమీపిస్తుండడంతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లలో ప్రభుత్వ , జిల్లా విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది .
పథకం అమలుకు కసరత్తు విద్యార్థులు , తల్లిదండ్రుల వివరాల సేకరణ
హామీల అమలులో దూసుకెళ్తున్న జగన్ ప్రభుత్వం ! ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు.
చదువుకు పేదరికం అడ్డురాకూడదని భావించిన సీఎం వైఎస్ . జగ న్మోహన్రెడ్డి అమ్మఒడి పథకం అమలు చేయాలని నిశ్చయించారు . ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు . ప్రస్తుతం అమ్మఒడి పథకం విధివిధానాలను ఖరారు చేశారు . దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో అమ్మ ఒడి పథకాన్ని తీసుకొచ్చారు . ఈ పథకం అమలుపై అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు . తల్లుల ఖాతా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు .
రాను . . రాను కనుమరుగైపో తున్న సర్కారు విద్యను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ప్రభుత్వ ఆశయం నెరవేరాలంటే పేదరికంలో ఉన్న ప్రతి విద్యార్టీ బడికి వెళ్లాలి . బడిబయట పిల్లలు ఎక్కడా కనిపించకూడదు . చదువుకు పేదరికం అడ్డుకాకుడదని సీఎం వైఎస్ . జగ న్మో హన్ రెడ్డి బలంగా భావిస్తున్నారు . ఆం దుకే అమ్మఒడి పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించారు . ప్రజాసంకల్ప యాత్రలో పేద విద్యార్థుల ఇబ్బందులు కళ్లారా చూసిన ఆయన అమ్మఒడి పథకాన్ని నవరత్నాల హామీలో పొందుపరిచారు . ఈ పథకం జనవరి 26 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు . సమయం సమీపిస్తుండడంతో పథకం అమలుకు అవసరమైన ఏర్పాట్లలో ప్రభుత్వ , జిల్లా విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది .
కసరత్తు ప్రారంభం
అమ్మఒడి పథకం అమలు దిశగా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది . జిల్లాలో అన్ని యాజమాన్యాలకు చెందిన 6 , 231 పాఠశాలలు ఉన్నాయి . అందులో ప్రాథ మిక 4 , 279 , ప్రాథమి కోన్నత 712 , ఉన్నత పాఠశాలలు 1 , 240 ఉన్నాయి . ప్రాథమిక పాఠ శాలల్లో 2 , 12 , 148 మంది , ప్రాథమికోన్నత పాఠశాలల్లో 60 , 932 మంది , ఉన్నత పాఠశాలల్లో 2 , 58 , 335 మంది విద్యార్థులు చదువుతు న్నారు . ఇంటర్మీడియెట్ కశాలలు 290 ఉం డగా , అందులో 1 , 76 , 562 మంది విద్యార్థులుచదువుతున్నారు . వారి వివరాలు , తల్లుల బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించా రు . ఈ మేరకు అమ్మఒడి విధివిధానాల ఉత్తర్వులను జిల్లాలోని ఆయా డివి జన్ల డీవైఈఓలకు , ఎంఈఓలకు డీఈఓ నరసింహారెడ్డి జారీచే శారు . ఈ కసరత్తులో విద్యాశాఖ అధికారులు నిమ గ్నమై ఉన్నారు . 11 అంశాలతో కూ డిన ప్రొఫార్మాను రూపొందించి , దాని ప్రకారం వివరాలు సేకరించి పంపాలని ఆదేశాలు అందాయి . ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2020 జనవరి 26వ తేదీన విద్యా రుల తల్లుల ఖాతాలో ఒక్కో విద్యార్థికి రూ . 15 వేల చొప్పున జమచేయనున్నారు .పథకం వర్తింపు ఇలా . .
- అర్హులైన లబ్దిదారు జాతీయ బ్యాంకు 1 లేదా పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి .
- అర్హులైన వారి అకౌంట్లకు ప్రతి ఏటా జనవరిలో రూ . 15 వేలు జమచేస్తారు .
- ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్ సైట్ను రూపొందించి రాష్ట్ర విద్యాశాఖ సీఎస్ఈ వెబ్ సైట్ తో లింక్ చేస్తారు .
- ఆయా విద్యాసంస్థలు అందజేసే విద్యా రుల డేటాను , హాజరును పరిశీలిస్తారు .
- ఇచ్చిన డేటాను తనిఖీ అధికారి ( ఎం ఈఓ / డీవైఈఓ డీఈఓ ) ధ్రువీకరిస్తారు .
- గ్రామ వలంటీరు క్షేత్రస్థాయిలో డేటాను ధ్రువీకరించాల్సి ఉంటుంది .
- డీఈఓ , ప్రాంతీయ అధికారి , వృత్తివిద్యా ధికారి , జిల్లా కలెక్టర్లకు లబ్దిదారుల డేటాను సమర్పించాలి .
- పథకంలో అక్రమాలు జరిగితే అది కారులు , లబ్ధిదారులనే బాధ్యులు చేస్తారు . ఐటీ , సివిల్ సప్లయ్స్ .
- రియల్ టైమ్ గవ ర్నెన్స్ విభాగాలు సాంకేతిక సహకారం తో డేటాను విశ్లేషిస్తారు . లబ్దిదారుల జాబితాలను గ్రామ , వార్డు 10 సచివాలయాల్లో సోషల్ ఆడిట్కు వీలుగా ప్రదర్శించాలి .
అర్హతలు ఇవే . .
- ప్రభుత్వ జీఓ 79 ( 04 - 11 - 2019 ) ప్రకారం అమ్మఒడి పథకానికి ఉండాల్సి అర్హతలను ప్రకటించారు .
- 1 . లబ్దిదారుడు ( తల్లి ) / సంరక్షుడు అర్హులు . ఆ కుటుంబంలోని పిల్లల సం ఖ్యతో సంబంధం లేకుండా మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు పథకం వర్తిస్తుంది .
- 2 . నిబంధనల ప్రకారం దారిద్ర్యరేఖకు దిగువున తల్లి ఉండాలి ( అంటే బీపీ ఎల్ కుటుంబానికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది)
- 3 . కుటుంబానికి ప్రభుత్వం జారీచే సిన తెల్లరేషన్కార్డు తప్పనిసరిగా ఉండాలి .
- 4 . లబ్ధిదారుల చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డును కలిగి ఉండాలి .
- 5 . చదువుతున్న పిల్లల ఆధార్ కార్డు వివరాలు 1 నుంచి 12వ తరగతుల మధ్య అందుబాటులో ఉండాలి ) .
- 6 . తల్లి మరణం లేదా లేకపోవడం విషయంలో పిల్లల సంరక్షుడికి రూ . 15 వేలు చెల్లిస్తారు .
- 7 . చెల్లుబాటుఅయ్యే రేషన్కార్డు 6 దశల ధ్రువీక రణకి లోబడి ఉంటుంది . ( పలు దశల్లో తెల్లరేషన్ కార్డును క్షుణ్ణంగా పరిశీలిస్తా రు ) .
- 8 లబ్దిదారుడి పిల్లలు 1 నుంచి 12 తరగ తులలో ఏపీ ప్రభుత్వం గుర్తించిన ప్రభుత్వ , ప్రైవేట్ ఎయిడెడ్ / ప్రైవేట్ అన్ ఎయిడెడ్ / జూనియర్ కళాశాలలు సహా / రెసిడెన్షియల్ పాఠశాలల్లో , కళా శాలల్లో చదువుతూ ఉండాలి .
- 9 ఈ మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా పాఠశా లల్లో ప్రవేశం పొందిన అనాథలు / వీధి పిల్లలకు సంబంధించి ఆశాఖ అధికారులతో చర్చించనున్నారు .
- 10 . విద్యార్థికి కనీసం 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి .
- 11 . విద్యార్థులు మధ్యలో చదువుమానేస్తే ఈ పథకం వర్తించదు . ఆ విద్యార్థిని తిరిగి బడికి తీసుకురావడా నికి అన్ని ప్రయత్నాలు చేయాలి .
- 12 . రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం , పీఎస్ యూ ఉద్యోగులు , ప్రభుత్వం ఆ ఉద్యోగుల పెన్షనర్లు , ఆదాయపు పన్ను చెల్లింపుదారులు అనర్హులు .
0 Response to "Amma's scheme has finalized the rules"
Post a Comment