Kishore vikasam
కిశోర వికాసం.
త్వరలో వినూత్న కార్యక్రమం..
బాలికల ప్రవేశాలు బాగున్న పాఠశాలలకు అవార్డులు...
మంచి నడతకు విద్యార్థులే మార్గ నిర్దేశకులు
త్వరలో వినూత్న కార్యక్రమం
పిల్లల్లో మంచి నడత , సాహజిక స్పృహ కలిగించడమే లక్ష్యంగా మహిళా శిశు సంక్షేమశాఖ , విద్యా శాఖ సంయుక్తంగా పాఠశాలల్లో ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాయి . కిశోర బాల వికాసం పేరుతో అమలు జరగ నున్న ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం బాలికా విద్యను ప్రోత్స హించడమే . ఇటీవలే ఈ బృహత్ కార్యక్రమానికి కార్యాచరణ ప్రణా ళిక రూపొందించారు . పరిసరాల పరిశుభ్రత , పచ్చదనం , వ్యక్తిగత
పరిశుభ్రత , బాల్య వివాహాల నిరోధం . . ఇలా 11 అంశాలపై 0 . ఉన్నత పాఠశాలల్లోని ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి . . ఆచ రించేలా చూస్తారు . ఆ క్రమంలో ప్రీ గ్రూప్ గానూ విద్యార్థులనే నియమిస్తారు .
రెండు రోజుల శిక్షణ
పాఠశాలలో ప్రతి 25 మంది విద్యార్థులకు ఒకరిని ఓ గ్రూప్ సభ్యుడిగా ఎంపిక చేస్తారు . ఇలా జిల్లాలో 1400 మందిని ఎంపిక చేసి వారికి రెండు రోజులపాటు 11 అంశాలపై శిక్షణ ఇస్తారు . ఇప్పటికే ఐసీడీఎస్ అధి కారులు శిక్షకులను ఎంపిక చేశారు . శిక్షణ పూర్తి చేసుకున్న వారు . . . ఆయా అంశాలపై సహచర విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తారు . ప్రస్తుతం విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది . ప్రోత్సాహమూ ఉంది . . . - ఈ ఏడాది ఐసీడీఎస్ చేపట్టిన మరో కార్యక్రమం బాలికా విద్యను ప్రోత్సహించడం . . పై తరగతులకు వెళ్లే సమయంలో బాలికల డ్రాపౌట్స్ అధికంగా ఉంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం - వాటికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది . ఆ క్రమంలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 20 మంది బాలికలకు ఒక్కొక్కరికి రూ . 20 వేల చొప్పున నగదు పురస్కారాలు ఇవ్వాలని నిర్ణయించింది . ఇందుకోసం నిరుపేద కుటుంబం నుంచి వచ్చి , ఇబ్బందులను అధి గమించి . . . చదువులో చక్కగా రాణించిన వారిని ఎంపిక చేసే బాధ్యతను డీఈవోకు అప్పగిం చింది . అదే విధంగా వై తరగతులకు వంద శాతం ఉత్తీర్ణత అయిన పాఠశాలలకు రూ . 20 వేల చొప్పున నగదు అందజేస్తారు . ఆ డబ్బును విద్యార్థుల అవసరాలకు పాఠశాలల్లో వినియో గించుకోవచ్చు . అయిదో తరగతి నుంచి ఆరో తరగతికి వంద శాతం ప్రవేశాలు జరిగిన అయిదు పాఠశాలలకు అవార్డు ఇస్తారు . 8 నుంచి 9వ తరగతికి , 9 నుంచి పదో తరగతికి వందశాతం విద్యార్థులు ప్రమోట్ అయిన అయిదు పాఠశాలలను ఎంపిక చేస్తారు . ఇలా మొత్తం 15 పాఠశాలలకు నగదు అవార్డులు అందజేస్తారు . దీనిపై డీఈవోను వీఎస్ సుబ్బారావును వివరణ కోరగా - ఐసీడీఎస్ అధికారులు కోరిన సమాచారాన్ని రెండు రోజుల్లో వారికి అందజే స్తామన్నారు . ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో నూతనోత్సాహం కలుగుతుందని చెప్పారు .
0 Response to "Kishore vikasam"
Post a Comment