Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

One Nation one Ration Card

' ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు ' 
One Nation one Ration Card
మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం 

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది . సామాన్యులకు ప్రయోజనకరంగా ఉండే పలు సంస్కరణలు చేపడుతోంది . తాజాగా , ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం కీలక అడుగులు వేసింది . దేశవ్యాప్తంగా లబ్దిదారులు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే ఒకే దేశం - ఒకే రేషన్ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణ వల్ల ఆంధ్రప్రదేశ్ లోని వారు తెలంగాణలో , తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు . ఏపీలో కూడా రేషన్ తీసుకోవచ్చు . రేషన్ కార్డు పోర్టబులిటీని ( ఎక్కడైనా రేషన్ తీసుకునేలా ) ప్రారంభించేందుకు దేశమంతా అన్ని రేషన్ షాపుల్లో యంత్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ రవి కాంత్ అన్నారు . లబ్దిదారులకు అప్పటికే రేషన్ కార్డు ఉండి ఉంటే . . వారు మరో ప్రాంతానికి లేదా మరో రాష్ట్రానికి తరలి వెళ్లినప్పుడు కొత్త రేషన్ కార్డు తీసుకోకుండా దాని పైనే రేషన్ ఇస్తారు . ఇదే రేషన్ కార్డు పోర్టబులిటీ ముఖ్య ఉద్దేశ్యం . వలస కార్మికులు , కూలీలు , రోజువారీ కూలీలకు ఇది ఎంతో ప్రయో జనం చేకూరుతుందని , వీరు తమ ఉపాధి కోసం నిత్యం ప్రాంతాలు లేదా రాష్ట్రాలు మారుతుం టారు . ఇలాంటి వారి కోసం ఇది ఉపయోగపడు తుంది . వీరు తమ రాష్ట్రాలు జారీ చేసిన రేషన్కార్డు ఆధారంగా ఏ రాష్నంలో అయినా బయో మెట్రిక్ ప్రామాణికం ద్వారా తమ కుటుంబం కోసం రేషన్ సరుకులు తీసుకోవచ్చు . ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పీడీఎస్ ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , గుజరాత్ , హర్యానా , జార ?ండ్ , కర్ణాటక , కేరళ , మహారాష్న , రాజస్థాన్ , త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఉంది . ఈ రాష్ట్రాల ప్రజలు ఆ రాష్ట్రంలోని ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది . ఇప్పుడు కేంద్రం సంస్కరణ ద్వారా ఏ రాష్ట్రంలోనైనా తీసుకోవచ్చు . కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుల సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేస్తోంది . లబ్దిదారులందరినీ జాతీయస్థాయిలో డీ - డూప్లికేషన్ చేసిన తర్వాత డేటా అప్ లోడ్ చేస్తారు . డీ - డూప్లికేషన్ తర్వాత సెంట్రల్ రిపోజిటరీలో పేర్లు ఉన్న లబ్దిదారులకు మాత్రమే రేషన్ కార్డు పోర్టబులిటీ ఉంటుంది . ఒకే దేశం . .ఒకే రేషన్ కార్డు విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇటీవల అమలులోకి తెచ్చారు . ఇందులో భాగంగా తెలంగాణ , ఏపీ , మహారాష్న గుజరాత్ కు చెందిన రెండు క్లస్టర్లుగా రేషన్ పంపిణీ ప్రారంభమైంది . ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహార భద్రతా శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి ఆన్ లైన్ ద్వారా శుక్రవారం ( 15 - 11 - 2019 ) ప్రారంభించారు . హైదరాబాదులో ఆదర్స్ నగర్ కాలనీలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ , విజయవాడలోని ఓ రేషన్ షాపు దుకాణంలో ఈ విధానం ద్వారా తొలిసారి రేషన్ పంపిణీ చేశారు . ప్రయోగాత్మకంగా వన్ నేషన్ - వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నామని , నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ - ఏపీ క్లస్టర్ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "One Nation one Ration Card"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0