The English medium is the focus of everyone
ఇంగ్లిష్ వైపే అందరి చూపు.
రాష్ట్రంలో మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు అంతా ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్సే ఉండగా, సర్కారు బడుల్లోనూ అటువైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు బడుల్లో ప్రైమరీ స్థాయి వరకూ తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2 శాతమే ఉండగా, హైస్కూల్స్థాయికి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత తగ్గింది. మరోపక్క సర్కారు విద్యాసంస్థల్లో ప్రైమరీలో కంటే, హైస్కూల్లోనే ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే ఐదేండ్లలో రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదివే విద్యార్థుల సంఖ్య పదిశాతంలోపే ఉంటుందని అంచనా. యూడైస్2018–19 లెక్కల ప్రకారం స్టేట్లో అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని 40,597 స్కూళ్లలో 58,10,490 మంది స్టూడెంట్లు చదువుతున్నారని అధికారులు చెప్పారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్లు 40,43,793 మంది ఉండగా, తెలుగు మీడియం స్టూడెంట్స్ కేవలం16,08,528 మందే.. మిగిలిన 1,58,169 మంది ఉర్దూ, హిందీతో పాటు ఇతర మైనర్మీడియాల్లో చదువుతున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోతోందన్నారు.
- ప్రైవేటు బడుల్లో 97 % .. సర్కారులో 38 % ఇంగ్లిష్ మీడియమే
- ఏటా తగ్గుతున్నతెలుగు మీడియం స్టూడెంట్లు
- ప్రైవేటులో తెలుగు మీడియం స్టూడెంట్లు 2 %
- ప్రభుత్వ బడుల్లో 57% మంది తెలుగు మీడియం
- గురుకులాలకు పెరుగుతున్న పోటీ
రాష్ట్రంలో మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా ఇంగ్లిష్ మీడియం చదువులు ఏటేటా పెరుగుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు అంతా ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్సే ఉండగా, సర్కారు బడుల్లోనూ అటువైపే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు బడుల్లో ప్రైమరీ స్థాయి వరకూ తెలుగు మీడియం చదువుతున్న విద్యార్థుల సంఖ్య 2 శాతమే ఉండగా, హైస్కూల్స్థాయికి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత తగ్గింది. మరోపక్క సర్కారు విద్యాసంస్థల్లో ప్రైమరీలో కంటే, హైస్కూల్లోనే ఇంగ్లిష్ మీడియంలో విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. ఈ ట్రెండ్ కొనసాగితే ఐదేండ్లలో రాష్ట్రంలో తెలుగు మీడియంలో చదివే విద్యార్థుల సంఖ్య పదిశాతంలోపే ఉంటుందని అంచనా. యూడైస్2018–19 లెక్కల ప్రకారం స్టేట్లో అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని 40,597 స్కూళ్లలో 58,10,490 మంది స్టూడెంట్లు చదువుతున్నారని అధికారులు చెప్పారు. ఇందులో ఇంగ్లిష్ మీడియం స్టూడెంట్లు 40,43,793 మంది ఉండగా, తెలుగు మీడియం స్టూడెంట్స్ కేవలం16,08,528 మందే.. మిగిలిన 1,58,169 మంది ఉర్దూ, హిందీతో పాటు ఇతర మైనర్మీడియాల్లో చదువుతున్నారు. ఇంగ్లిష్ మీడియం విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ పోతోందన్నారు.
0 Response to "The English medium is the focus of everyone"
Post a Comment