Warning to SBI Customers
ఖాతాదారులకు హెచ్చరిక..నష్టపోతే మాకు సంబంధం లేదు!
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం, ఖాతా వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయరాదని , ఒకవేళ దీనివల్ల ఖాతాదారులకు నష్టం కలిగితే దానికి తాము బాధ్యులం కాదని బ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంక్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. దీనికి రిప్లే ఇస్తూ ఒక బ్యాంక్ కస్టమర్.. తన సేవింగ్స్ అకౌంట్ నెంబర్, ఇతర డాక్యుమెంట్లను పోస్ట్ చేశారు. దీంతో బ్యాంక్ స్పందించింది. వెంటనే ఆ పోస్ట్ను డిలేట్ చేయాలని సదురు కస్టమర్ను కోరింది. 'దయచేసి మీ అకౌంట్ నెంబర్ను షేర్ చేయవద్దు. అలాగే మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో పబ్లిక్కు తెలియజేయవద్దు.
సెక్యూరిటీ సమస్యలు రావొచ్చు. వివరాలను షేర్ చేయడం వల్ల ఖాతాదారులకు ఏమైనా నష్టం వాటిల్లితే దానికి మేం బాధ్యత తీసుకోం. వెంటనే ఆ పోస్ట్ను తొలగించండి' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ లేదా బ్యాంక్కు చెందిన ఉద్యోగులు ఎవరైనా ఎప్పటికీ పేమెంట్ లింక్ లేదా ఇతర ట్రాన్సాక్షన్ లేదా వీపీఏ యూపీఐ సంబంధిత వివరాలను కస్టమర్లను కోరరని ఎస్బీఐ తెలిపింది.
యూజర్ ఐడీ, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సీవీవీ నెంబర్, ఓటీపీ వంటి వివరాలను కూడా తెలియజేయమని అడగరని పేర్కొంది. ఎస్బీఐ ఎప్పటికప్పుడు తన కస్టమర్లను హెచ్చరిస్తూ వస్తోంది. మోసగాళ్ల బారిన పడొద్దని సూచిస్తోంది. ఇటీవలనే ఖాతాదారులను హెచ్చరించింది. ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్పై క్లిక్ చేయవద్దని తెలియజేసింది. అకౌంట్ స్టేటస్ తెలుసుకోవడానికి బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాలని కోరింది.
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లను హెచ్చరిస్తోంది.అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం, ఖాతా వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయరాదని , ఒకవేళ దీనివల్ల ఖాతాదారులకు నష్టం కలిగితే దానికి తాము బాధ్యులం కాదని బ్యాంక్ స్పష్టం చేసింది. బ్యాంక్ ట్విట్టర్లో ఒక ట్వీట్ చేసింది. దీనికి రిప్లే ఇస్తూ ఒక బ్యాంక్ కస్టమర్.. తన సేవింగ్స్ అకౌంట్ నెంబర్, ఇతర డాక్యుమెంట్లను పోస్ట్ చేశారు. దీంతో బ్యాంక్ స్పందించింది. వెంటనే ఆ పోస్ట్ను డిలేట్ చేయాలని సదురు కస్టమర్ను కోరింది. 'దయచేసి మీ అకౌంట్ నెంబర్ను షేర్ చేయవద్దు. అలాగే మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని కూడా సోషల్ మీడియాలో పబ్లిక్కు తెలియజేయవద్దు.
సెక్యూరిటీ సమస్యలు రావొచ్చు. వివరాలను షేర్ చేయడం వల్ల ఖాతాదారులకు ఏమైనా నష్టం వాటిల్లితే దానికి మేం బాధ్యత తీసుకోం. వెంటనే ఆ పోస్ట్ను తొలగించండి' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. అంతేకాకుండా స్టేట్ బ్యాంక్ లేదా బ్యాంక్కు చెందిన ఉద్యోగులు ఎవరైనా ఎప్పటికీ పేమెంట్ లింక్ లేదా ఇతర ట్రాన్సాక్షన్ లేదా వీపీఏ యూపీఐ సంబంధిత వివరాలను కస్టమర్లను కోరరని ఎస్బీఐ తెలిపింది.
యూజర్ ఐడీ, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సీవీవీ నెంబర్, ఓటీపీ వంటి వివరాలను కూడా తెలియజేయమని అడగరని పేర్కొంది. ఎస్బీఐ ఎప్పటికప్పుడు తన కస్టమర్లను హెచ్చరిస్తూ వస్తోంది. మోసగాళ్ల బారిన పడొద్దని సూచిస్తోంది. ఇటీవలనే ఖాతాదారులను హెచ్చరించింది. ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్పై క్లిక్ చేయవద్దని తెలియజేసింది. అకౌంట్ స్టేటస్ తెలుసుకోవడానికి బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాలని కోరింది.
0 Response to "Warning to SBI Customers"
Post a Comment