Census from April
ఏప్రిల్ నుంచి జన గణన
45 రోజులు ఎన్పీఆర్ కార్యక్రమం
ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్.
2021 ,ఫిబ్రవరిలో పాపులేషన్ ఎన్యుమరేషన్
45 రోజులు ఎన్పీఆర్ కార్యక్రమం
ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్.
2021 ,ఫిబ్రవరిలో పాపులేషన్ ఎన్యుమరేషన్
జనాభా గణన 2021 ప్రక్రియ వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది . ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఉత్తర్వులను సెన్సెస్ శాఖ జారీ చేసింది . ప్రిన్సి పల్ సెన్సెస్ అధికారిగా కలెక్టర్ను నియమించిం ది . గణన చార్జెస్ అధికారులుగా మండల తహసీ ల్దార్లు వ్యవహరించనున్నారు . నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ( ఎన్పీఆర్ ) కార్యక్రమాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 45 రోజుల పాటు నిర్వహించాలని ఆదేశించింది . ఇక జనాభా గణనకు సంబంధించి పాపులేషన్ ఎన్యుమరేషన్ కార్యక్రమాన్ని 2021 ఫిబ్రవరి 9వ తేదీ నుంచి అదే నెల 28వ తేదీ వరకు చేపట్టాలని సూచించింది . జనాభా గణన నిర్వహణకు సంబంధించి సమగ్ర షెడ్యూలను త్వరలో సెన్సెస్ శాఖ పంపనున్నట్లు సమాచారం . కాగా , 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 40 , 81 , 148 మంది జనాభా ఉన్నారు . ఇందులో 20 , 64 , 495 మంది పురుషులు , 20 , 16 , 653 మం ది మహిళలు ఉన్నారు . పదేళ్లకు ఒకసారి జనాభా గణనను సెన్సెస్ శాఖ చేపడుతోంది . ఆత్మకూరులో ప్రీ - టెస్ట్ గణన పూర్తి . . . రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం లో ప్రీ - టెస్ట్ జనాభా గణన ఈ ఏడాది ఆగస్టు 5న చేపట్టి అక్టోబరు 5వ తేదీ నాటికి పూర్తి చేశారు . హౌస్టింగ్ , ఎన్సీఆర్ ఆగస్టు 8వ తేదీ నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు , పాపులేషన్ ఎన్యుమరేషన్ సెప్టెంబరు 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు , రివిజనల్ రౌండ్ను అక్టోబరు 1వ , 2వ తేదీల్లో నిర్వహించారు .
0 Response to "Census from April"
Post a Comment