Changes in teacher transfers ..
ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది
ఉపాధ్యాయుల బదిలీల్లో మార్పులు..
ఆరు అంశాలపై పాయింట్లు కేటాయింపు..
వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి సిఫార్సు..
బదిలీల దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం లభించాలి..
ప్రస్తుత బదిలీల్లో నిబంధనలు ఇలా..
రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన దస్త్రం ప్రభుత్వానికి చేరింది . దీనిపై సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది . ఈ దఫా బదిలీల నిబంధనల్లో మార్పు చేస్తున్నారు . గతంలో నిర్వహించిన బదిలీల్లో పని తీరు ఆధారంగా కొన్ని పాయింట్లు కేటాయించగా . . ఈసారి వాటిని తొలగించారు . వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలను నిర్వహించాలని పాఠశాల విద్య కమిషనరేట్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది . ప్రస్తుతం బదిలీలపై నిషేధం ఉన్నందున సంబం ధిత దస్త్రానికి ముఖ్యమంత్రి ఆమోదం లభించాలి .
నిబంధనలు ఇలా . .
- ప్రస్తుత బదిలీల్లో ఆరు నిబంధనలను తీసు కురానున్నారు .
- వాటికి పాయింట్లు కేటాయించ నున్నారు . అవి . . గ్రామీణం , మారుమూల , పట్టణాలకు ప్రాంతాల వారీగా పాయింట్లు ( హెమోగ్లి ) సర్వీసు స్పౌజ్ అవివాహితులు సంఘాల నేతలు హేతుబద్దీకరణ.
జనవరిలోనా . . ఏప్రిల్ లోనా ?
ఈ ఏడాది వేసవిలో జనగణన ప్రారంభమవుతు న్నందున ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టడం కష్ట మని , ముందుగానే నిర్వహించాలని ఇటీవల మంత్రి సురేష్ కు ఉపాధ్యాయ సంఘాలు విన్నవించాయి . దీనిపై స్పందించిన ఆయన జనవరిలో నిర్వహిస్తా మని ప్రకటించారు . జనవరిలో స్థానిక సంస్థల ఎన్ని కలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది . అదే జరిగితే బదిలీలకు ఆటంకం ఏర్పడుతుంది . జనవరిలో నిర్వహించకపోతే ఏప్రిల్ నుంచి జనగణన మొదలవుతుందని , ఆ సమ యంలోకుదరదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు .
0 Response to "Changes in teacher transfers .."
Post a Comment