Good news for pensioners, Advance policy available from January 1.
పెన్షన్దారులకు శుభవార్త, జనవరి 1 నుంచి అందుబాటులోకి అడ్వాన్స్ విధానం.
APEdu.in 11.00AM 29.12.19
పెన్షన్దారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త. చాలాకాలంగా ఉన్న వారి కోరిక నెరవేరుతోంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి కొంత మొత్తాన్ని అడ్వాన్స్గా తీసుకునే వెసులుబాటు కలగనుంది.
2020 జనవరి 1వ తేదీ నుంచి ఇది అందుబాటులోకి వస్తోంది. 2009లో రద్దు చేసిన ఈ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని EPFO నిర్ణయించింది
ఈ నిర్ణయంతో పెన్షన్ అడ్వాన్స్ తీసుకోవాలని కోరుకున్న 6,30,000 మంది లబ్ధి పొందనున్నారని ప్రభుత్వం తెలిపింది. దీని ప్రకారం పదిహేనేళ్ల వరకు నెలవారీ పెన్షన్ మూడో వంతు కోత ద్వారా ఆ మొత్తాన్ని పెన్షన్దారులకు చెల్లిస్తారు
పదిహేనేళ్ల తర్వాత తిరిగి పూర్తి పెన్షన్ అందుబాటులోకి వస్తుంది.
ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న ఈ విధానం ప్రయివేటు ఉద్యోగులకు కూడా వర్తింప చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ జనవరి 1, 2020న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్ణయం అమలుపై నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందని చెబుతున్నారు.
0 Response to "Good news for pensioners, Advance policy available from January 1."
Post a Comment