Smart services of village secretaries
గ్రామ సచివాలయాల స్మార్ట్ సేవలు..
రాష్ట్ర వ్యాప్తంగా 2.65 లక్షల సెల్ ఫోన్లు పంపిణీ..
డీపీవో, సీఈవో ల పర్యవేక్షణ..
జనవరి నుంచి ఆన్ లైన్ లో సేవలు..
డీపీవో, సీఈవో ల పర్యవేక్షణ..
జనవరి నుంచి ఆన్ లైన్ లో సేవలు..
www.APEdu.in 6:30 AM 30.12.19
నూతన సంవత్సరంలో గ్రామ సచివాలయాల స్మార్ట్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి .
రాష్ట్రంలోని అన్ని సచివాల యాల్లోని గ్రామ వాలంటీర్లకు 2 . 65 లక్షల సెల్ ఫోన్లను ప్రభుత్వం పంపిణీ చేయ నుంది . గ్రామ వాలంటీర్లు పెన్షన్లు , బియ్యం పంపిణీతోపాటు మీ సేవ కేంద్రం అందించేసుమారు 50 రకాలసేవలను గ్రామీణ ప్రజలకు అందించనున్నారు . వీటి పర్యవేక్షణ జిల్లా పంచాయతీ అధికారి , జెడ్పీసీవోలు చూడనున్నారు . రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షా 50 వేల గ్రామ సచివాలయాలు ఉండగా , ఇప్పటికే పలు సచివాలయాలకు శాశ్వత భవనాలతో పాటు ఫర్నిచర్ ను కూడా ఏర్పాటు చేశారు . ఈ నెలాఖరుకు దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు పూర్తి మౌలిక వసతులు చేకూర్చి జనవరి 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు యంత్రాంగం సమా యత్తమవుతోంది . ప్రభుత్వం అందించే 4జీ స్మార్ట్ ఫోన్ల ద్వారా గ్రామ వాలంటీర్లు ఇంటింటికీ వెళ్ళి వేలిముద్రలు సేకరించనున్నారు . అదే విధంగా రేషన్ , ఆధార్ అనుసంధానించనున్నారు . జనవరి 1 నుంచి పెనర్లు , స్మార్ట్ ఫోన్ల ద్వారానే పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది . స్మార్ట్ ఫోన్లను సెల్ కాన్ కంపెనీ సరఫరా చేయనుంది . సెల్ ఫోన్ సాఫ్వేరు సంబంధిం చిన సిమ్ లు ఏసీటీఎస్ అందజేయనుంది . జనవరి నెలలో వాలంటీర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసి శిక్షణ ఇవ్వనున్నారు . గ్రామ సచివాలయం సేవలు నూతన సంవత్సరంలో ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి .
0 Response to "Smart services of village secretaries"
Post a Comment