The Cabinet meeting on the 11th passed several key bills
ఈ నెల 11న మంత్రివర్గ సమావేశం పలు కీలక బిల్లులకు ఆమోదం
- ఈ నెల 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
- పలు కీలక అంశాలపై సత్వర నిర్ణయం తీసుకునే విధంగా ప్రతి నెలా రెండు, నాలుగో బుధవారాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు.
- సోమవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది.
- ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ప్రైవేటు వాహన చార్జీల నియంత్రణ,
- మహిళల భద్రత, లైంగిక వేధిపులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు,
- దేవాలయ కమిటీ సభ్యుల సంఖ్య పెంపు వంటి అంశాలపై రూపొందించిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి.
- వాటితో పాటు మరికొన్ని టేబుల్ ఐటంలకూ మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభిస్తుందని అధికారులు చెప్తున్నారు.
0 Response to "The Cabinet meeting on the 11th passed several key bills"
Post a Comment