Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

To start posting for eligible candidates in DSC-2018

డీఎస్సీ-2018 లో అర్హత సాధించిన వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభం..
To start posting for eligible candidates in DSC-2018


జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ ఆదేశాలు..
అర్హులందరికీ SMS ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు..

 డీఎస్సీ 2018లో అర్హత సాధించిన . . వారికి పోస్టింగ్ ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది . హైకోర్టు తీర్పు మేరకు 2 వేల 865 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది . దీంతో ఈ పోస్టులకు సంబం ధించి జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయాలని విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందాయి . ఈ నేపథ్యంలో జిల్లాల అధికారులు జాబితాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు . 2018లో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 902 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు డీఎస్సీ నిర్వహించిన విషయం తెలిసిందే . డిసెంబర్ జనవరి నెలల్లో జరిగిన పరీక్షల్లో 5 లక్షల 5 వేల 547 మంది అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు . ఫిబ్రవరి 15న విడుదలైన ఫలితా ల్లో దాదాపు 4 లక్షల పైచిలుకుమంది అర్హత సాధించారు . ఈ మొత్తం పోస్టుల్లో జిల్లా పరిషత్ పాఠశాలల పరిధిలో 4 వేల 341 పోస్టులు , మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1100 పోస్టులు , ఆదర్శ పాఠశాలల కు సంబంధించి 909 పోస్టులు , గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు , రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175 , బీసీ సంక్షేమ పాఠ శాలల్లో 404 , పాఠశాల విద్యా శాఖ పరిధిలో 173 పోస్టులు ఉన్నాయి . వీటిలో పీజీ టీ , టీజీటీ పోస్టులకు సం బంధించి రెండో విడత సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయింది . ప్రొవిజనల్ జాబితాలో తిరస్క రణకు గురైన అభ్యర్థులకు బదులుగా . . మెరిట్ ఉన్న అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేశారు . అయితే ఈ నియామకాలకు సంబంధించి కొంత మంది అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించడంతో పోస్టుల భర్తీ ఆగిపోయింది . 

సగం పోస్టులు పెండింగ్ లోనే . . 

.కోర్టు కేసుల కారణంగా 7 వేల 902 పోస్టుల్లో 4 వేల 638 పెండింగ్ లో ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 3 వేల 264 పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ జాబితాను వెల్లడించారు . ఆ లాగే స్పోర్ట్స్ , దివ్యాంగుల కోటాకు సంబంధించి 142 పోస్టుల సర్టి ఫికెట్ల పరిశీలన జరుగుతోంది . అలాగే రిజర్వేషన్ కోటాలో ఆర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో 382 పోస్టుల ఖాళీగా ఉన్నాయి . ఈ నేపథ్యంలో ఎన్టీ తెలుగు పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 5 , 6 తేదీల్లో సర్టిఫికెట్ల ఆలోడింగ్ ప్రక్రి య జరిగింది . అభ్యర్థులు అప్లోడ్ చేసిన సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల కమిటీల ఆధ్వ ర్యంలో జరుగుతోంది . ఇదిలా ఉండగా . . హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో పెండింగ్ లో ఉన్న 2 వేల 865 పోస్టులకు లైన్ క్లియరైనట్లయింది . ఈ పోస్టుల భర్తీని పది రోజుల్లో పూర్తి చేస్తామని అసెంబ్లీ సమావేశాల్లో విద్యాశాఖ మంత్రి డా , ఆదిమూలపు సురేష్ ప్రకటించారు . మిగిలిన పెండింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి కోర్టుల్లో ఉన్న కేసుల విషయంలోనూ ప్ర భుత్వం తరఫున కౌంటర్లు వేసి , లీగల్ ఒపీనియన్లు తీసుకుని త్వరలో భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు . దీంతో జిల్లాల వారీగా అధికారులు అర్హులైన వారికి పోస్టింగ్ ఇచ్చేలా జాబితాలు సిద్ధం చేస్తున్నారు . అర్హులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపి వెబ్ ఆప్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకోనున్నారు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "To start posting for eligible candidates in DSC-2018"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0