Mee Seva free in Grama Sachivalayas
ఇక ఉచితంగా మీసేవలు..
గ్రామ, వార్డు సచివాలయాలకు ఆన్లైన్ సేవలు బదలాయింపు
ప్రతి అర్జీ మూడు రోజుల్లోగానే పరిష్కరించాలని ఆదేశాలు
మీసేవలు ఇకనుంచి ప్రజలందరికీ ఉచితంగా అందే అవకాశం ఉంది.
గ్రామ, వార్డు సచివాలయాలకు ఆన్లైన్ సేవలు బదలాయింపు
ప్రతి అర్జీ మూడు రోజుల్లోగానే పరిష్కరించాలని ఆదేశాలు
మీసేవలు ఇకనుంచి ప్రజలందరికీ ఉచితంగా అందే అవకాశం ఉంది.
- ఇప్పటివరకూ మీసేవా కేంద్రాల ద్వారా అందుతున్న 540 రకాల ఆన్లైన్ సేవలను గ్రామ, వార్డు సచివాలయాలకు బదలాయిస్తూ ప్రభుత్వం నిర్ణయించింది.
- విద్యార్థులు కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు పొందడంతోపాటు ఉద్యోగ విద్య పోటీ పరీక్షలకు మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునేవారు.
- దీనికిగాను రూ.30 నుంచి 60 వరకూ చెల్లించాల్సి వచ్చేది. ఇకముందు ఈ సేవలన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే అందిస్తాయి.
- దరఖాస్తు చేసుకుంటే అన్నిసేవలు ఉచితంగానే పొందే అవకాశాలు కల్పించారు. నివాస, కుల, జనన, ధ్రువీకరణ పత్రాలు ఇంటిపన్ను, రెవెన్యూపరమైన భూముల వివరాలు ఇంటిముందు సచివాలయాల ద్వారా పొందవచ్చు.
- మీ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు అందుతున్న అన్నిరకాల పనులు గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా అందించనున్నారు.
- డిజిటల్ అసిస్టెంట్కు దరఖాస్తు అందించి రసీదు పొందాల్సి ఉంటుంది.
- ఉచిత సేవలు 72 గంటల్లోగా అందించాలని నిర్ణయించారు. అంటే ప్రతి అర్జీని మూడు రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది.
- గ్రామ, వార్డు సచివాలయాల్లో మీ సేవలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదురైతే పరిష్కారంకోసం 1902 టోల్ ఫ్రీ నెంబరుతోపాటు 1800 4254 440 నెంబర్లకు ఫిర్యాదు చేసే అవకాశాలు కల్పించారు.
0 Response to "Mee Seva free in Grama Sachivalayas"
Post a Comment