Selection of a beneficiary's choice of Ammavadi
* పారదర్శకంగా ‘అమ్మఒడి’ లబ్ధిదారుల ఎంపిక*
★ అమ్మఒడి పథకం లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.
★ శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు,పాఠశాలల్లో అమ్మఒడి లబ్ధిదారుల జాబితాలు పెట్టామని వెల్లడి.
★ ఇప్పటి వరుకు *43 లక్షల మంది* తల్లులను లబ్ధిదారులుగా గుర్తించామని అన్నారు. తెల్ల రేషన్కార్డు, ఆధార్, బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేసి లబ్ధిదారులను గుర్తించామన్నారు.
★ అమ్మ ఒడి పథకం కోసం *రూ.6,400* కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ నెల 9న చిత్తూరులో అమ్మఒడి పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
★ దేశంలో అమ్మఒడి పథకం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. 5వ తేదీ వరకు ఎంతమంది లబ్ధిదారులను గుర్తిస్తే అంత మందికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.
★ *ముందుగా ఒక్క రూపాయి ఖాతాల్లో వేసి లబ్ధిదారుల ఖాతాలను తనిఖీ చేస్తామని వ్యాఖ్య.*
★ *9న ఒకేసారి రూ.15వేలు జమ* చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.
0 Response to "Selection of a beneficiary's choice of Ammavadi"
Post a Comment