The government has increased the deadline for applying for village secretariat jobs
సచివాలయ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు పెంపు
పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్
పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 7వ తేదీవరకు గడువు పెంచినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. మొదట ప్రకటించిన ప్రకారం శుక్రవారంతో గడువు ముగిసిందని, వివిధ జిల్లాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పెంచామని చెప్పారు. గ్రేడ్-2 గ్రామ వ్యవసాయ సహాయకుల పోస్టులకు విద్యార్హతలను సడలిస్తూ గురువారం నిర్ణయం తీసుకున్నందున అలాంటి వారందరికి దరఖాస్తు చేసుకోడానికి తగిన సమయం అవసరమని భావిస్తున్నామని ఆయన వివరించారు. పంచాయతీ కార్యాలయాల్లో అనేక ఏళ్లుగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు(డీఈవో)గా పని చేస్తున్న వారంతా డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోడానికి వీలు కల్పించే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. ఏదైనా డిగ్రీతోపాటు ప్రఖ్యాత శిక్షణ కేంద్రంలో కంప్యూటర్ కోర్సు చేసినట్లు ధ్రువపత్రం ఉన్న వారంతా దరఖాస్తు చేసుకోడానికి అర్హులుగా ప్రతిపాదించామని కమిషనర్ వివరించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాక ఈ విషయంలో అధికారిక ప్రకటన చేస్తామని ఆయన పేర్కొన్నారు.
0 Response to "The government has increased the deadline for applying for village secretariat jobs"
Post a Comment