Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

For Outsourcing Employees. . . . Withholding of February Wages! • Requirements to be made by Outsourcing Corporation.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు . . . . ఫిబ్రవరి వేతనాల నిలిపివేత !
• ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారానే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఆదేశం.
For Outsourcing Employees. . . . Withholding of February Wages!  • Requirements to be made by Outsourcing Corporation.

 రాష్ట్ర ప్రభుత్వం లోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఫిబ్రవరి నెలకు సంబంధించిన వేతనాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది . ప్రైవేటు ఏజెన్సీల ద్వారా వివిధ శాఖల్లో స్వీపర్లు , డ్రైవర్లు , గుమాస్తాలు , డేటా ఎంట్రీ ఆపరేటర్లు , సెక్యూరిటీ గార్డులు , క్లీనర్లు తదితర ఉద్యోగుల సేవలను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంది . ముఖ్యంగా దేవాదాయ , రెవెన్యూ , మున్సిపల్ , పంచాయతీ రాజ్ , రూరల్ డెవలప్మెంట్ , టూరిజం , ఎక్సెజ్ వంటి శాఖల్లో ఈ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అధిక మొత్తంలో పనిచేస్తున్నారు . రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో నాలుగు లక్షలకు పైచిలుకు ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్నట్లు అధికారి క లెక్కలు చెబుతున్నాయి . వీరంతా కూడా ప్రైవే టు ఏజెన్సీల ద్వారా నియమించబడి ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తుండటంతో ప్రభుత్వం ఇచ్చే వేతనాల్లో 20 శాతం మేర ఏజెన్సీ తీసుకుని , మిగిలిన మొత్తాన్ని సంబంధిత ఉద్యోగికి ఇస్తున్నా రు . ఈ దోపిడీని అరికట్టేందుకు గత ఏడాది నవంబర్ 30న ముఖ్యమంత్రి జగన్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోడ్ సర్వీసెస్ ( ఏపీసీఓఎస్ ) ద్వారా ఈ నియామకాలు చేపట్టాల ని ఆదేశించారు . ఈ మేరకు ప్రస్తుతం పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ఏపీసీఓఎస్ ద్వారా నియమించుకోవాలని అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేశారు . అయితే , అప్పటికప్పుడు వీరిని

దెబ్బతింటున్న ప్రభుత్వ లక్ష్యం

 వివిధ శాఖల్లో మొత్తం 4 లక్షల మంది పైచిలుకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉద్యోగాలు చేస్తుండగా ఇప్పటి వరకూ కేవలం 27 వేల మం దికి సంబంధించిన శాలరీ ఇండెంట్లు మాత్రమే ప్రభుత్వానికి అందాయి . జనవరి 31 వరకు గడువు ఇచ్చినప్పటికీ సంబంధిత శాఖలు తమ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్‌కు అఫిలియేట్ చేయకపోవడం , కొత్త వారిని నియ మించుకోవడం కార్యక్రమాలు చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు దెబ్బతింటున్నాయి .వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంచివేతనాలు ఇస్తున్నప్పటికీ అవి పూర్తిస్థాయిలో వారికి చేరక పోవడం పట్ల ముఖ్య మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ ముఖ్య భూమిక పోషించాలని సీఎం ఆకాంక్షించారు . ఇందులో భాగంగానే సిబ్బంది ఎవరైతే గవర్న మెంట్ ఏజెన్సీ కింద వివిధ శాఖల్లో పనిచేస్తు న్నారో వారందరినీ కార్పొరేషను అఫిలియేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు . ఈ మేరకు జీఏడీ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లు , అన్ని శాఖల ఉన్నతాధికారులు వారివారి శాఖల్లో అవసరమైన ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివరాలను ఆయా శాఖల అధికారిక వెబ్ సైట్లలో పొందుపర్చాలని ఆదేశించారు . మార్చి నెల నుండి ఇకపై ఏ శాఖలోనూ ప్రైవేటు ఏజెన్సీల ద్వారా ఉద్యోగలు నియమించబడటానికి వీల్లేని ఆయన స్పష్టం చేశారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "For Outsourcing Employees. . . . Withholding of February Wages! • Requirements to be made by Outsourcing Corporation."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0