If Iris machine gone. The cost has to be paid
ఐరిస్ యంత్రం పోయిందా.. ఖరీదు చెల్లించాల్సిందే
- ప్రభుత్వం పాఠశాలలకు సరఫరా చేసిన ఐరిస్ యంత్రాలు మరమ్మతులకు, చోరీకి గురైతే వాటి ఖరీదు సొమ్మును ఉపాధ్యాయుల నుంచి వసూలు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
- రెండేళ్ల క్రితం ఉపాధ్యాయుల బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం ఐరిస్ డివైస్లు, వేలిముద్ర యంత్రాలను పాఠశాలలకు సర్వశిక్షాభియాన్ ద్వారా సరఫరా చేశారు. కొన్ని పాఠశాలల్లో ఐరిస్ యంత్రాలు మరమ్మతులకు, అపహరణకు గురైనట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
- ఈ నేపథ్యంలో ఐరిస్ యంత్రాలకు ప్రధానోపాధ్యాయులను పూర్తి బాధ్యులను చేశారు. ఐరిస్ యంత్రం విలువ రూ.16,600 ఉంది. చోరీ జరిగినా, మరమ్మతులకు గురైనా ఆ యంత్రం విలువను సదరు పాఠశాల ఉపాధ్యాయుల నుంచి వసూలు చేస్తారు.
- ఆ మొత్తానికి డీడీ తీసి విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయానికి పంపించాలని కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
0 Response to "If Iris machine gone. The cost has to be paid"
Post a Comment