Jobs in the "Today" group .. Degree is enough .. Salary 25,000.
"ఈనాడు" గ్రూపులో ఉద్యోగాలు.. డిగ్రీ ఉంటే చాలు.. జీతం 25,000..
ఈనాడు .. తెలుగులో ప్రతిష్టాత్మకమైన దినపత్రిక . తెలుగులో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న పత్రిక కూడా . ఇప్పుడు ఈ గ్రూపు సంస్థల్లో ఉద్యోగ అవకాశం వచ్చింది . రామోజీ గ్రూపు సంస్థ అయిన ఉషోదయా పబ్లికేషన్స్ సంస్థ మేనేజ్ మెంట్ ట్రయినీల కోసం దరఖాస్తులు కోరుతోంది . ఈ ఉద్యోగాల కోసం ఎవరైనా డిగ్రీ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు . ఈనాడు గ్రూపు సంస్థల్లో ఉద్యోగం అంటే దాదాపు ప్రభుత్వ ఉద్యోగంగా భావిస్తుంటారు.
కాకపోతే వయస్సు 24 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి . కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి . కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నవారికి ప్రయారిటీ ఉంటుంది . దరఖాస్తుల పరిశీలన తర్వాత రాత పరీక్ష ఉంటుంది . ఈ రాత పరీక్ష ఏపీ , తెలంగాణల్లో అనేక కేంద్రాల్లో నిర్వహిస్తారు . ఎంపికైన వారికి ఒక సంవత్సరం పాటు ఉద్యోగ శిక్షణ ఉంటుంది .
శిక్షణ సమయంలో రూ . 20,000 స్టయిఫండ్ గా ఇస్తారు . ఎంపికైన వారు ఏపీ , తెలంగాణల్లో ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి . శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులను రూ . 25, 000 ప్రారంభవేతనంతో ఉద్యోగంలోకి తీసుకుంటారు .
ఆసక్తి ఉన్నవారు .. recruitment@eenadu.net కు మెయిల్ ద్వారా కానీ .. లేదా రెజ్యూమ్లు పది రోజుల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ - హెచ్ఆర్ , ఉషోదయా పబ్లికేషన్స్ , ఈనాడు కార్పొరేట్ ఆఫీస్ , రామోజీ ఫిలింసిటీ - 501512 చిరునామాకు పంపొచ్చు . మరిన్ని వివరాల కోసం ఫిబ్రవరి 28 నాటి ఈనాడు దినపత్రికను పరిశీలించవచ్చు .
0 Response to "Jobs in the "Today" group .. Degree is enough .. Salary 25,000."
Post a Comment