Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

About D.S.C


  • ' డిఎస్ సి సమస్య తీరేనా ?
  • నోటిఫికేషన్ కోసం ఎదురుచూపులు 
  • ఇంకా కోర్టులోనే 2018 నోటిఫికేషన్ కేసు 
  • సమస్య పరిష్కారానికి చొరవ చూపని ప్రభుత్వం 
  • రాష్ట్ర వ్యాప్తం గా 25 వేల పోస్టులు ఖాళీ

 About D.S.C


 రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఖాళీ అవుతున్న పోస్టులను భర్తీ చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది . కీలకమైన డిఎసి విషయంలో ఇది ప్రస్ఫుట0గా కనిపిస్తోంది . గత ప్రభుత్వంలో 2016 , 2018లో డిఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి . అయితే 2018 నోటిఫికేషన్‌పై తమకు అన్యాయ0 జరిగిందంటూ కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఆది ఆగిపోయింది . ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకూ నోటిఫికేషన్ ఇవ్వలేదు . అధికారంలోకి వస్తే ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తానని ప్రకటించిన సిఎం ఆ దిశగా చర్యలేమీ తీసుకోకపోగా కోర్టులో నడుస్తున్న 2018 నోటిఫికేషన్ కేసు సమస్య పరిష్కారానికి ఎటువంటి చర్యలూ లేవు . 2016 డిఎస్సీలో 10 , 330 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 8972 పోస్టులు మాత్రమే భర్తీ చేశారు . మిగిలిన పోస్టులు ఖాళీగానే ఉంచారు . 2018లో 7 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు . అందులో 3900 సెకండ్ గ్రేడ్ టీచర్ ( ఎస్పీజీ ) పోస్టులకు సుమారు ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు . వీరికి ఆన్‌లైన్‌లో తొమ్మిది రోజులపాటు రోజుకు రెండు పేపర్ల చొప్పున విడతల వారీగా మల్టీ టైమ్ , మల్టీ పేపర్ పరీక్షలు నిర్వహించారు . అందులో పేపర్ సులువుగా వచ్చినవారు క్వాలి ఫై అయ్యారు . కష్టంగా వచ్చిన వారు క్వాలిఫై కాలేక , ఇది అన్యాయమంటూ కోర్టుకెళ్లారు . ఇలాంటి సమయాల్లో కష్టమైన పేపర్ వచ్చిన వారికి నార్మలైజేషన్ పద్ధతిలో మార్కుల్లో కొంత వెసులుబాటు కల్పిస్తారు . ఈ పద్ధతి ఆర్ ఆర్ బి , ఎస్ఎస్ సి , బ్యాంకు ఉద్యోగ నియామకాల్లో పాటిస్తారు . డిఎస్సీకి మాత్రం అమలు కావడం లేదు . దీన్ని అమలు చేయాలని కోర్టుకెళ్లడంతో క్వాలిఫై అయిన వారంతా సందిగ్ధంలో పడ్డారు . 
ఇంగ్లీషు మీడియంతో తిప్పలు
 ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 25 వేల పోస్టులు ఖాళీ ఉన్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయాల నుండి ప్రభుత్వానికి సమాచారం అందింది . అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరమూ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన జగన్ ఇప్పటి వరకూ ఒక్క నోటిఫికేషనూ ఇవ్వలేదు . ఇదిలా ఉండగా , ప్రభుత్వం ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో ఇప్పటి వరకూ తెలుగులో ప్రిపేర్ అయిన వాళ్లు ఇప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి , ఏ పుస్తకాలు చదవాలి , పరీక్షలు ఎలా ఉండబోతున్నాయనేది అర్ధంగాక ఆందోళన పడుతున్నారు . డిఎస్ సి శిక్షణ తీసుకునే అభ్యర్థులు ఇప్పటి వరకూ షార్ట్ టెర్మ్ కు రూ . 15 వేలు , ఫుల్టెర్మ్ కు రూ . 45 వేలు ఖర్చు చేసేవారు . ఇప్పుడు ఇంగ్లీషు మీడియం కావడంతో శిక్షణ ఫీజులు రెట్టింపు చేసే అవకాశం ఉందని ఆశావహులు చెబుతున్నారు . గతంలో బిఇడి అభ్యర్థులు ఎతైటీ పోస్టులకు అర్హులు కాదు . కానీ ప్రభుత్వం ఆ నియమానికి సడలింపు ఇవ్వడంతో పోటీ కూడా పెరిగింది .
 PET లూ అరకొరే . . . 
ప్రభుత్వం ప్రతి శనివారం నో బ్యాగ్ డేని ప్రవేశపెట్టింది . ఆ రోజు క్రీడలు , వ్యక్తిత్వ వికాసం క్లాసులు మాత్రమే చెప్తారు . దీనికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ( పిఇటి ) ముఖ్యం . రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ప్రాధమిక పాఠశాలలు ఉన్నాయి . వీటిలో 20 శాతం పాఠశాలల్లో మాత్రమే పిఇటిలు ఉన్నారు . గత నోటిఫికేషన్ విడుదల సమయంలో 1500 పోస్టులు ఖాళీ ఉండగా 173 పోస్టులకు మాత్రమే ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది . దీంతో పిఇటి అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో 400 పోస్టులకు పెంచింది . అయితే ఎతైటీ పోస్టులను కుదించడం కొసమెరుపు

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to " About D.S.C "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0