Breaking down the lock on the corona is a huge value Fully locked 548 districts nationwide
కరోనా పై లాక్ డౌన్ అస్త్రం ఉల్లంఘిస్తే భారీ మూల్యం
దేశవ్యాప్తంగా 548 జిల్లాలు పూర్తిగా లాక్
తిరువనంతపురం...
కేరళ రాజధాని తిరువనంతపురంలో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ నిన్న ప్రకటించారు.
గుజరాత్లో నిర్బంధం...
గుజరాత్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అహ్మదాబాద్లో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
షహీన్బాగ్ ఖాళీ...
కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో దిల్లీ షహీన్బాగ్లో నిరసనలు చేపడుతోన్న ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు పోలీసులు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
భద్రత కట్టుదిట్టం...
దిల్లీ షహీన్బాగ్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్లీలో 144 సెక్షన్ విధించిన దృష్ట్యా నిరసనలు చేపట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
డౌన్లాక్డౌన్...
కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది.ఆదివారం వరకు దేశంలోని 80 జిల్లాల్లోనే లాక్డౌన్ విధించగా ఆ జాబితాను విస్తరించింది ప్రభుత్వం. భారత్లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుండగా 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి దిగ్బంధం ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 జిల్లాల్లో మాత్రమే లాక్డౌన్ విధించారు. మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో పాక్షికంగా సేవలు నిలిపి వేశారు. సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
దేశవ్యాప్తంగా 548 జిల్లాలు పూర్తిగా లాక్
తిరువనంతపురం...
కేరళ రాజధాని తిరువనంతపురంలో రహదారులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు రాష్ట్రం మొత్తం లాక్డౌన్ విధిస్తున్నట్లు సీఎం పినరయి విజయన్ నిన్న ప్రకటించారు.
గుజరాత్లో నిర్బంధం...
గుజరాత్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు చాలా చోట్ల స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. అహ్మదాబాద్లో రహదారులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
షహీన్బాగ్ ఖాళీ...
కరోనా వైరస్ నియంత్రణ నేపథ్యంలో దిల్లీ షహీన్బాగ్లో నిరసనలు చేపడుతోన్న ఆందోళనకారులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు పోలీసులు. పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
భద్రత కట్టుదిట్టం...
దిల్లీ షహీన్బాగ్ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. దిల్లీలో 144 సెక్షన్ విధించిన దృష్ట్యా నిరసనలు చేపట్టకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు.
డౌన్లాక్డౌన్...
కరోనా వ్యాప్తిని నియంత్రించే క్రమంలో దేశంలోని 30 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 548 జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించారు. ఈ మేరకు కేంద్రం కీలక నిర్ణయం వెలువరించింది.ఆదివారం వరకు దేశంలోని 80 జిల్లాల్లోనే లాక్డౌన్ విధించగా ఆ జాబితాను విస్తరించింది ప్రభుత్వం. భారత్లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలుండగా 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాల్లో పూర్తి దిగ్బంధం ప్రకటించింది. మధ్యప్రదేశ్, ఉత్తర్ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లోని 58 జిల్లాల్లో మాత్రమే లాక్డౌన్ విధించారు. మరో కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్లో పాక్షికంగా సేవలు నిలిపి వేశారు. సిక్కిం, మిజోరం రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
0 Response to "Breaking down the lock on the corona is a huge value Fully locked 548 districts nationwide"
Post a Comment