RBI approves merger of banks This will reduce the number of banks from April 1
ఏప్రిల్ 1 నుంచి ఆంధ్రా బ్యాంక్ సహా ఆ 5 బ్యాంకులు కనుమరుగు!
ఆ ఆరు బ్యాంకులు ఇక లేనట్లే
బ్యాంకుల విలీనానికి ఆర్బీఐ ఆమోదం.దీంతో ఏప్రిల్ 1 నుంచి తగ్గనున్న బ్యాంకుల సంఖ్య.
- ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటివి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో విలీనం అవుతాయి.
- సిండికేట్ బ్యాంక్ కెనరా బ్యాంక్లో కలిసిపోతుంది.
- ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండిలో విలీనం అవుతాయి.
- ఇక చివరిగా అలహాబాద్ బ్యాంక్ కూడా ఇండియన్ బ్యాంక్లో కలిసిపోతుంది.
- ఏప్రిల్ 1 నుంచి విలీనమైన బ్యాంకుల బ్రాంచులు అన్నీ మెయిన్ బ్యాంక్ బ్రాంచులుగా మారిపోతాయి.
- అంటే ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెనరా బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి.
- ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా రూపాంతరం చెందుతాయి.
- అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచులుగా పనిచేస్తాయి.
- విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి.
- 2017లో దాదాపు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీనం తర్వాత పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్గా అవతరిస్తుంది.
- ఎస్బీఐ అతిపెద్ద బ్యాంక్గా కొనసాగుతోంది.
- ఇక బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది. దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఉంటాయి.
- ఇక సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్ అనేవి ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు.
0 Response to "RBI approves merger of banks This will reduce the number of banks from April 1"
Post a Comment