Selavulapai Sandigdham
సెలవులపై సందిగ్ధం
- 18 రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్
- రాష్ట్రంలో మూసివేతకు సీఎం నిరాసక్తి
- పెరుగుతున్న కరోనా అనుమానితులు
- రిస్క్ తీసుకోవడం అవసరమా .
- సెలవులిస్తేనే మేలంటున్న అధికారులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రక టించేశాయి . రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై డైలమాలో ఉంది . ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది . ఈ రెండు వారాల వ్యవధిలోనే 120 కేసులు పాజిటివ్ గా తేలాయి . పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసం స్థలు , సినిమాహాళ్లు , షాపింగ్ మాలు మూసేయాలని ఆదేశాలిచ్చాయి . బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను రద్దు చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీచేశాయి . అయితే ఏపీలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది . కానీ , ప్రతి జిల్లాలోనూ రోజుకి ఇద్దరు , ముగ్గురు ఆస్పత్రుల్లో చేరుతు న్నారు . మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో మినీ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఆరోగ్య శాఖ . సోమవారం ప్రైవేటు ఆస్పత్రులతో కూడా చర్చలు జరిపింది . ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెయ్యి పడకలు సిద్ధం చేసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాన్ని కోరారు . ఆదివారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా విద్యాసంస్థలు , సినిమా హాళ్ల మూసివేతపై చర్చించారు . సీఎంవోతో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా సెలవులు ప్రకటిస్తేనే మంచి దని సీఎంకు సూచించారు . దీనిపై సీఎం స్పందిస్తూ . . . ఎన్ని రోజులని సెలవు లిస్తాం . . అవసరం లేదు . . ? వైరస్ ప్రభావం అధికమైన ప్పుడు చూద్దాంలే . . అని దాటవేశారు . దీంతో అధికా రులు కూడా మిన్నకుండిపో యారు .
సెలవులపై ఒకేమాట
కరోనా ప్రభావం , ప్రస్తుత పరిస్థితులపై సీఎంవో అది కారి పి . వి . రమేశ్ తొమ్మిది శాఖలతో విజయవాడలో సమావేశంలో నిర్వహించారు . ఈ సందర్భంగా జవహర్ రెడ్డి కరోనాపై అధికారులకు పవర్ పాయింట్ ప్రజంటే షన్ ఇచ్చారు . అనంతరం పాఠశాలు , కళాశాలలు , వర్సిటీలకు సెలవులు అంశం చర్చకు వచ్చింది . ఈ సమయంలో అన్ని శాఖ అధికారులు సెలవులు ప్రటిస్తేనే పాఠశాల విద్యాధికారులు కూడా రిస్క్ తీసుకోవడం ఎందుకన్న ఉద్దేశాన్ని వ్యక్తం చేశారు . ప్రస్తుతం విద్యార్థు లంతా ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్నారు . సిలబస్ కూడా ఎప్పుడో హర్తయిపో యింది కాబట్టి ఇప్పుడు సెల వులు ప్రకటించినా నష్ట మేమీ లేదన్న అభిప్రా యాన్ని అధికారులు వ్యక్తం చేశారు . కానీ సీఎంతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో అధికారుల్లో క్లారిటీ లేకుండా పోయింది .
13 అనుమానిత కేసులు . . .
రాష్ట్రంలో ప్రస్తుతం 13 అనుమానిత కేసులున్నాయి . మీదరిని ఆయా జిల్లాల్లోని ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యసేవ లందిస్తున్నారు . మంగళవా రానికి వీరి నివేదికలు వస్తా యని అధికారులు చెబుతు న్నారు . ఇప్పటి వరకూ నెల్లూరు మినహా ఎక్కడా పాజిటివ్ కేసులు నమోదుకాలేదు . 76 శాంపిలో 75 నెగిటివ్ వచ్చాయి .
0 Response to "Selavulapai Sandigdham"
Post a Comment