Data collection from large exercise districts for teacher replacement
- టీచర్ల భర్తీకి భారీ కసరత్తు జిల్లాల నుంచి డేటా సేకరణ
- లాక్ డౌన్ పూర్తయిన వెంటనే నోటిఫికేషన్
- విద్యా సంవత్సరం మొదలయ్యేలోపే పూర్తి చేయాలని లక్ష్యం
రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది . అందులో భాగంగా ప్రభుత్వ ఆయా యాజమాన్యాల పరిధుల్లోని పాఠశాలల్లో ఖాళీల సంఖ్యను జిల్లాల వారీగా సేకరిస్తోంది . అందుకోసం ఇప్పటికే జిల్లాల విద్యాశాఖాధి కారులకు ఆదేశాలు కూడా చేశారు . గతేడాది ప్రభుత్వ పరిధిలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య , ఉపాధ్యాయుల సంఖ్య బట్టి స్టూడెంట్ , టీచర్ నిష్పత్తిని లెక్కించనున్నారు . దాని ప్రకారం ఈ ఏడాది పై తరగతుల్లోకి వెళ్లే విద్యార్థుల సంఖ్య , కొత్తగా అడ్మిషన్లు ఎన్ని వస్తాయనే అంచనా , రిటైరయ్యే ఉపాధ్యాయుల సంఖ్యలను అంచనా వేసి , తదనుగుణంగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది . తొలుత ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించి , తర్వాత నియామక పరీక్ష ద్వారా భర్తీ చేసేలా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది . పెద్ద సంఖ్యలోనే ఖాళీలు . . రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి . అనేక చోట్ల ఏకోపాధ్యాయులతో పాఠశాలలు నడుస్తున్నాయి . మరికొన్ని చోట్ల అయితే కనీసం ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేరు . అయితే ఇప్పటి వరకు ప్రాథమికంగా ఖాళీలపై విద్యాశాఖకు సమాచారం అందింది . దానిపై జిల్లాల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో తక్షణమే భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య అందించాలని ప్రభుత్వం ఆదే శించింది . 13 జిల్లాల్లో ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు లేని ప్రాథమిక పాఠశాలల సంఖ్య 507గా ఉంది . మండల పరిషత్ , జిల్లా పరిషత్ ల పరిధి లో నడుస్తున్న పాఠశాలలైతే 1456 ఉన్నట్లు లెక్కలు వచ్చాయి . ఇక ఏకోపాధ్యాయులతో నడుస్తున్న పాఠశాలల సంఖ్య ప్రభు త్వ యాజమాన్యంలోనివి 1207 కాగా . . మండల పరిషత్ , జిల్లా పరిషత్ ఆధ్వర్యంలోనివి దాదాపు 8 వేల 203 ప్రాథమిక పాఠశాలలుగా ఉన్నట్లు జిల్లాల నుంచి సమాచారం సేకరించా రు . అయితే జిల్లాల విద్యాశాఖాధికారుల ఆధ్వర్యంలో పరిశీ లించి , వాస్తవ నివేదికలు అందించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు . ఈ నేపథ్యంలో మే మొదటి వారంలో పూర్తిస్థాయిలో అంచనాలు రానున్నాయి .
2018 డీఎస్సీ నియామకాలు పూర్తయ్యాకే . .
2018లో నిర్వహించిన డీఎస్సీలో భర్తీ చేయాల్సిన వేలాది పోస్టులు న్యాయస్థానాల్లో కేసుల కారణంగా నిలిచిపోయాయి . అందుకోసం కోర్టుల్లో ఉన్న కేసులు త్వరగా పరిష్కారమయ్యే లా కౌంటర్లు వేయడంతోపాటు , తీర్పు వచ్చేలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోం ది . ప్రతి సంవత్సరంటెట్ రెండుసార్లు నిర్వహించాల్సి ఉన్నా . . వివిధ కారణాల వల్ల , ఇప్పుడు కరోనా వల్ల పరీక్షలు జరగలేదు . 2018లో డీఎస్సీ , టెట్ ఒకేసారి నిర్వహించారు . ఈసారి మాత్రం ముందుగా టెట్ నిర్వహించాలని భావిస్తున్నారు . మరోవైపు డీఎస్సీ 2018 సమస్యను త్వరితగతిన పరిష్కరించి నియామకాలు పూర్తి చేయాలని , ఆ వెంటనే అవసరమైన అన్ని ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . 2018 డీఎస్సీలో 2 వేల 278 ఎసీటీ , 340 పీఈటీ , 248 భాషా పండి తులు , 77 ఆదర్శ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరా లు న్యాయవివాదాల కారణంగా నిలిచిపోయాయి . వీటి నియామక ప్రక్రియ పూర్తి చేసి , ఆ వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు . ఏడాదిగా వరుస వాయిదాలు . . గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభు త్వం ఏర్పాటైన నాటి నుంచి డీఎస్సీపై విద్యాశాఖ మంత్రి డా . ఆదిమూలపు సురేష్ ప్రకటనలు చేస్తూనే వస్తున్నారు . తొలుత ఆగస్టు , తర్వాత డిసెంబర్ అంటూ ఎన్నోసార్లు వాయి దా వేశారు . గతేడాది డిసెంబర్ లోనే సుమారు 8 వేల పోస్టుల అంచనాతో జనవరిలో నోటిఫికేషన్ ఇస్తామంటూ పలు వేదిక లపై ప్రకటించినప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చ లేదు . కాగా లాక్ డౌన్ ముగిసిన వెంటనే కొత్త విద్యా సంవత్స రానికి సంబంధించిన షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఉపాధ్యాయులే లేని , ఏకోపాధ్యాయ పాఠశాలల్లో అవసరమై న పోస్టులను తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంది . అంతే కాకుం డా కొత్త విద్యా సంవత్సరంలో తెలుగు , ఆంగ్ల మాధ్యమాలు సమాంతరంగా కొనసాగించాల్సి ఉండటంతో ఉపాధ్యాయుల భర్తీ అవసరం మరింతగా పెరిగింది . ఈ నేపథ్యంలో ఖాళీలపై కసరత్తు త్వరితగతిన పూర్తి చేసి , విద్యా సంవత్సరం ప్రారంభం లోపే ఒక కొలిక్కి తేవాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు .
0 Response to "Data collection from large exercise districts for teacher replacement"
Post a Comment