These are the key decisions taken by SBI in April.
ఏప్రిల్లో ఎస్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే.
- 1. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎస్బీఐ కస్టమర్లను ఆదుకోవడానికి ఎస్బీఐ ప్రీ-అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది. కేవలం 4 క్లిక్స్తో లోన్స్ మంజూరు చేస్తోంది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ రుణాలను ఇస్తోంది
- 2. ఎస్బీఐలో సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారికి బ్యాంక్ షాకిచ్చింది. సేవింగ్స్ అకౌంట్పై ఇచ్చే వడ్డీని తగ్గించింది. అంటే సేవింగ్స్ అకౌంట్లో మీ డిపాజిట్లకు గతంలో కన్నా తక్కువ వడ్డీ వస్తుంది.
- 3. తరచూ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవారికి ఊరట కలిగించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI. లాక్డౌన్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2020 జూన్ 30 వరకు ఏటీఎం సర్వీస్ ఛార్జీలు లేవని స్పష్టం చేసింది.
- 4. ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేవారిని హెచ్చరించింది ఎస్బీఐ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో నకిలీ వెబ్సైట్ ఆన్లైన్లో కనిపిస్తుంది. ఈ వెబ్సైట్ను నమ్మొద్దని హెచ్చరిస్తోంది బ్యాంకు.
- 5. ఎస్బీఐ డెబిట్ కార్డుల కోసం అప్లై చేసినవారికి కీలక సమాచారాన్ని షేర్ చేసింది బ్యాంకు. కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా డెబిట్ కార్డుల డెలివరీలో జాప్యం ఉంటుందని ప్రకటించింది.
- 6. ఎస్బీఐలో లోన్ తీసుకున్న కస్టమర్లకు ఈఎంఐ భారాన్ని తగ్గించింది బ్యాంకు. ఎస్బీఐలో హోమ్ లోన్, ఆటో లోన్, పర్సనల్ లాంటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించింది.
- 7. ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బిల్లులపై మారటోరియం ఎంచుకున్న కస్టమర్లను హెచ్చరిస్తోంది ఎస్బీఐ. మారటోరియం ఎంచుకునే కస్టమర్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నట్టు బ్యాంకు గుర్తించింది. అందుకే కస్టమర్లను అప్రమత్తం చేసింది.
- 8. ఎస్బీఐలో ఇప్పటికే ఈఎంఐ చెల్లించి వెనక్కి తీసుకోవాలనుకునే కస్టమర్లకు అవకాశం ఇస్తోంది బ్యాంకు. ఎస్బీఐలో టర్మ్ లోన్స్ అంటే హోమ్, పర్సనల్, ఎడ్యుకేషన్, ఆటో లాంటి రుణాలు తీసుకున్నవారు మారటోరియం ఎంచుకోవచ్చు.
0 Response to "These are the key decisions taken by SBI in April."
Post a Comment