దేశవ్యాప్తంగా మే 17 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రహోంమంత్రిత్వశాఖ
దిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరో రెండోవారాలపాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మే 4 నుంచి మే 17 వరకు లాక్డౌన్ కొనసాగనుందని స్పష్టం చేసింది. మరోవైపు ప్రధాని మోదీ రేపు ఉదయం 10 గంటలకు జాతిని ఉద్దేశించి మాట్లాడనున్నారు.
0 Response to "The Central Home Ministry has issued a decree extending the lockdown until May 17"
Post a Comment