Meeting with teacher unions on transfers and adjustments tomorrow
బదిలీలు , సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాలతో రేపు భేటీ
తొమ్మిది గుర్తింపు సంఘాలకు ఆహ్వానం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకే అనుమతి.
తొమ్మిది గుర్తింపు సంఘాలకు ఆహ్వానం అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులకే అనుమతి.
అమరావతి : ఉపాధ్యాయుల బదిలీలు ,సర్దుబాటు సంఘాలతో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరిం చింది . వచ్చే నెల ఒకటిన ( జూలై 1 ) రాష్ట్రంలో గుర్తింపు పొందిన తొమ్మిది ఉపాధ్యాయ సంఘాలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నది . విజయవాడలోని సమగ్ర శిక్షణ కార్యాలయంలో రోజు ఉదయం 10.30 గంటలకు సమావేశం నిర్వహించనున్నట్లు పాఠశాల విద్య జాయింట్ డైరెక్టర్ ( జేడీ , సర్వీసెస్ ) డీ దేవానందరెడ్డి తెలిపారు . ఈ మేరకు ఆయా సంఘాలకు సోమవారం లేఖలను పంపించారు . వచ్చే నెలలో నిర్వహించనున్న బదిలీలకు ముందే రేషనలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది . అందులో భాగంగానే ఇటీవల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చిన వీరభద్రుడు , ఇతర అధికారులు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు .
రేషనలైజేషన్ పై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం పై సంఘాలు భగ్గుమన్నాయి . ఇదే అంశంపై ఈ నెల 28 న ' గురువుల కొలువుల్లో ఎసరు ' అనే శీర్షికన ' విశాలాంధ్ర'లో వార్త ప్రచురితమైంది . ఈ వార్తకు స్పందించిన పాఠశాల విద్య కమిషనర్ వీ చిన వీరభద్రుడు ఉపాధ్యాయ సంఘాలతో బదిలీలు టీచర్ల సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించారు. అయితే , సంఘాలకు ఆహ్వానాలు పంపించలేదు .STU, UTF , APTF( 1938 ) , APTF ( 257 ) , AP HM ల సంఘం , APUS , AP ప్రాథమిక టీచర్ల సంఘం , PRTU రెండు గ్రూపులకు విద్యాశాఖ నుంచి ఆహ్వానాలు అందాయి . విద్యాశాఖ నిర్వహించే సమాశానికి ప్రతి సంఘం అధ్యక్షుడు , ప్రధాన కార్యదర్శి మాత్రమే హాజరుకావాలని జేడీ దేవానందరెడ్డి స్పష్టం చేశారు . సమావేశంలో ప్రధానంగా ఉపాధ్యాయుల బదిలీలు , సర్దుబాటుపైనే చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది .
బదిలీలకు ముందే నిర్వహించే సర్దుబాటు ప్రక్రియలో ఈ ఏడాది ప్రభుత్వం మార్పులు చేసింది . విద్యార్థులు , ఉపాధ్యాయ నిష్పత్తిని 1:30 చేసింది . అలాగే ఎల్ఎస్ఎల్ హెచ్ఎంలను సెకండరీ గ్రేడ్ టీచర్స్ గా ( ఎపీటీ ) గుర్తించాలని నిర్ణయించింది . దీనివల్ల సుమారు పది వేల ఎక్స్ట్రీటీ పోస్టులకు ప్రమాదం పొంచి ఉంది . ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడంపై అన్ని సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . ఇప్పటికే నాడు- నేడు పనులలో సంఘాల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్న ప్రభుత్వం , ఏకపక్షంగా బదిలీలు చేపడితే మరిన్ని విమర్శలకు గురయ్యే అవకాశం ఉంది . దీంతో తప్పనిసరి పరిస్థితులలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమై బదిలీలు , సర్దుబాటుపై చర్చించాలని నిర్ణయించింది . సమావేశం అనంతరం బది లీలు , రేషనలైజేషన్ షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది .
0 Response to "Meeting with teacher unions on transfers and adjustments tomorrow"
Post a Comment