Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

No Finals, No Entrance, Only Admissions


  • నో ఫైనల్స్, నో ఎంట్రన్స్,ఓన్లీ అడ్మిషన్స్
  • ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టెన్ , ఇంటర్ పరీక్షలు రద్దు 
  • గ్రేడ్లు ప్రకటించి ప్రమోషన్
  • కీలక ప్రవేశ పరీక్షలు రద్దు 
  • తరగతి మార్కుల ఆధారంగా సీట్లు  
  • ఆలస్యంగానైనా విద్యాసంవత్సరం 
  • ప్రయివేటు విద్యాసంస్థలకూ ఊతం 
  • యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం
No Finals, No Entrance, Only Admissions

కోవిడ్ 19 మహమ్మారి విద్యార్థుల భవి తవ్యంతో కూడా ఆట్లాడుతోంది . దేశంలోని వివిధ ప్రముఖ విశ్వవిద్యాలయాలు , వివిధ బోర్డులు నిర్వ హించే పరీక్షలు రద్దవుతున్నాయి . ప్రస్తుత పరి స్థితుల్లో వీటిని నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వా లకు , విశ్వవిద్యాలయాలకు , బోర్డులకు నెలకొంది . ఇప్పటికే ఒడిషా , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణా , మహ రాష్ట్ర మరియు తమిళనాడు ప్రభుత్వాలు 10 వ తరగతి , ప్లస్ 2 పరీక్షల్ని రద్దు చేశాయి . తరగతుల్లో నిర్వహించే అభ్యాస పట్టికల మూల్యాంక మార్కులకనుగుణంగా విద్యార్ధు లకు గ్రేడ్లు ప్రకటిస్తూ వారిని పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయి . కాగా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది . పాఠశాలలు , కళాశాలలు , విశ్వవిద్యాలయాల  స్థాయిలో అనేక పరీక్షలు రద్దు చేయబడుతున్నాయి . కీలక కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలు కూడా రద్దవుతున్నాయి . ప్రస్తుత తరగతుల మార్కుల ప్రాతిపదికగానే ఈ కోర్సుల్లో సీట్ల కేటాయింపునకు ప్రభుత్వాలు సంసిద్ధమౌతున్నాయి . మహరాష్ట్రలో డిగ్రీ , పోస్టు గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది పరీక్షలు కూడా రద్దు చేశారు .

 పరీక్షల్లేకుండానే విద్యార్ధుల్ని ఉత్తీర్ణుల్ని చేశారు . మహారాష్ట్ర సిబిఎస్ఇ 12 వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి . జెఇఇ మెయిన్ 2020 పరీక్షల్ని రద్దు చేస్తున్నారు . నీట్ 2020 పరీక్షల తేదీని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు . ఇవి కూడా రద్దయ్యే జాబితాలో చేరిపోయాయి . బిట్సాట్ 2020 రద్దయింది . నాటా 2020 పరీక్షల్ని నిలిపేశారు . క్లాట్ 2020 ని ఆపేశారు . ఎన్‌సిహెచ్ఎమ్ జెఇ 2020 రద్దయింది . ఎఐఎపిజిఇటి 2020 కూడా రద్దు చేశారు . మేట్ 2020 ని రద్దు చేసేందుకు యోచిస్తున్నారు . త్రిపుర బోర్డు నిర్వహించే 10 , 12 తరగతుల పరీక్షల్ని రద్దు చేసింది . బీహార్ బిసిజన్న 2020 పరీక్షల్ని ఈ ఏడాది నిలిపేస్తు న్నట్లు ప్రకటించింది . గోవాలో అన్ని రకాల పరీక్షల్ని నిలిపేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది . హిమాచల్ ప్రదేశ్ లో అన్ని రకాల పరీక్షల్ని రద్దు చేశారు . మేఘాలయలో ఇప్పటికే 12 వ తరగతి పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రక టించారు . ఒడిషాలో యుజి , పిజి కోర్సులకు ప్రకటిం చిన పరీక్షల షెడ్యూల్ ను రద్దు చేశారు . నాగపూర్ విశ్వవిద్యాలయ పరీక్షలన్నింటిని రద్దు చేసింది . కర్ణా టకలో ఎస్ఎస్ఎసి పరీక్షలు రద్దయ్యాయి . పియుని పరీక్షలు కూడా రద్దుకానున్నాయి . ఐఐటి కాన్పూర్ తన యుణి , పిజి పరీక్షల్ని రద్దు చేసింది . ఉత్తరాఖండ్ 10 , 12 వ తరగతుల పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసు కుంది . ఇసిఎస్ఆ , ఇఎన్ని పరీక్షలు కూడా రద్దయ్యాయి . తమిళనాడులో 10 , 12 వ తరగతి పరీక్షలు నిల్చిపో యాయి . రాజస్థాన్ విశ్వవిద్యాలయం అన్ని పరీక్షల్ని ఆపేస్తున్నట్లు ప్రకటించింది . పశ్చిమబెంగాల్ లోని జెకె బోస్ బోర్డ్ పరీక్షలు రద్దయ్యాయి . చత్తీ ఫుడ్ 10 , 12 వ తరగతి పరీక్షల్ని నిలిపేసింది . మధ్యప్రదేశ్ లో అన్ని విశ్వవిద్యాలయాలు , కళాశాలల్ని ఇప్పట్లో తెరిచేది లేదని ప్రకటించింది . ముంబయ్ విశ్వవిద్యాలయం యొక్క ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విభాగం అన్ని పరీక్షల్ని రద్దు చేసింది . బీహార్ లో బుజెట్ రద్దయింది . దేవి 2020 రద్దయింది . విఇడి , సిఇటి పరీక్షల్ని రద్దు చేశారు . అలీఘర్ ముస్లీం విశ్వవిద్యాలయ ప్రవేశ పరీక్ష అహల్య విశ్వవిద్యాలయం పరీక్షల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది . బీహార్ డిఎఎడ్ జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది . ఎమ్ హెడ్స్ , సిఇటి 2020 పరీక్షలు నిల్చిపోయాయి . కుసాట్ క్యాట్ 2020 పరీక్ష రద్దయింది . ఉత్తర్ ప్రదేశ్ బిఎడ్ జెఇ 2020 రద్దు చేసింది . ఐదేళ్ళ ఇంటిగ్రేటెడ్ ఎస్ఎల్ బి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎమ్ హెచ్ , సిఇటి లాసెట్ 2020 ని రద్దు చేశారు . వీటి 2020 రద్దయింది . ఇఎస్ఎల్‌యు ప్రవేశ పరీక్షను రద్దు చేశారు . అలహాబాద్ విశ్వవిద్యాలయ పిజి పరీక్షల్ని రద్దు చేస్తూ నిర్ణయించారు . కేరళ సెట్ 2020 రద్ద యింది . మహరాష్ట్రలో బిఇడి , ఎమ్ ఇడి , బిటిఇడి , ఎమ్ పిఇడి పరీక్షల్ని రద్దు చేశారు . ఇవేకాదు . ఐటిడిపి రిక్రూట్‌మెంట్ పరీక్షల్ని రద్దు చేశారు . ఆర్బిఐ అసిస్టెంట్ మెయిన్ పరీక్షను రద్దు చేశారు . కేరళ పిఎస్సి రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేశారు . బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక పరీక్షను రద్దు చేశారు . ఢిల్లీ హయ్యర్ జ్యూడిషియల్ సర్వీసెస్ మెయిన్స్ 2019 పరీక్షల్ని రద్దు చేశారు . ఎఐఐఎమ్ జి పిజి పరీక్షల్ని రద్దు చేశారు . కెఇపిఎమ్ 2020 పరీక్షలు రద్దయ్యాయి . లబ్లీ ప్రొఫెషనల్ విశ్వవిద్యాలయం , అమిటి విశ్వవిద్యా లయం , జెఇసిఆర్ సి విశ్వవిద్యాలయాల పరీక్షలు రద్దు చేశారు . ఎస్ఏడి , డిఎటి 2020 రద్దయింది . ఎఎజి నీట్ , యుజిసి నెట్ , సిమేట్ , జిపాట్ , డ్యూయెట్ , జెఎన్‌యు ఇఇ పరీక్షలు రద్దయ్యాయి . బెనారస్ హిందూ యూనివర్శిటీకి చెందిన యుఇటి , పిఇటి పరీక్షల్ని రద్దు చేశారు . ఇవన్నీ ఈ ఏడాదికి ఇక లేనట్లే . అయితే ప్రైవేటు విశ్వవిద్యాలయాలు , కళాశాలలు , సాంకేతిక విద్యా సంస్థలు ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటు న్నాయి . దీంతో పాటు విద్యార్ధులు కూడా విద్యాసంవ త్సరాన్ని వృధా చేసుకునేందుకు సిద్ధంగా లేరు . ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఇప్పటికే తరగతుల్లో నిర్వహించిన వివిధ పరీక్షల్లో మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించి ఈ ఏడాది ఆలస్యంగానైనా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది . తద్వారా అటు విద్యాసంస్థలు , ఇటు విద్యార్ధుల ప్రయోజనాల్ని పరిరక్షించాలని ఆశిస్తోంది .



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "No Finals, No Entrance, Only Admissions"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0