The state ministerial conference is over. Highlights
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ముఖ్యాంశాలు
రామాయపట్నం పోర్టుపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు
- రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం ముగిసింది.
- వైఎస్ఆర్ చేయూత పథకానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
- ఎస్సీ, ఎస్టీ బీసీ మహిళలకు నాలుగేళ్లలో 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.
- ఈ పథకాన్ని ఆగస్టు 12 ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.
- రామాయపట్నం పోర్టుపై మంత్రివర్గం చర్చించింది.
- కేంద్ర నిధుల కోసం ప్రయత్నిస్తూ.. ప్రాజెక్టుపై ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.
- ఐదు దశల్లో రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఆగస్టు నాటికి టెండర్లు పిలవాలనీ..
- మెుదటి దశలో 4,736 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ సూచించారు.
- పోర్టు టెండర్లను జూడిషీయల్ ప్రివ్యూకి పంపించాలని జగన్ ఆదేశించారు.
- 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి... డిస్కమ్, ట్రాన్స్కోలకు 6 వేల కోట్ల ఆత్మనిర్బర్ భారత్ నిధుల ఖర్చుకు కేబినేట్ ఆమోదం తెలిపింది
0 Response to "The state ministerial conference is over. Highlights"
Post a Comment