Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

NIIT, JEE MAINS The Union Minister for announcing the new schedule

సెప్టెంబరు 13న నీట్‌
సెప్టెంబరు 1-6 తేదీల్లో జేఈఈ మెయిన్స్‌
సెప్టెంబరు 27న జేఈఈ అడ్వాన్స్‌డ్‌
కొత్త షెడ్యూల్‌ ప్రకటించిన కేంద్రమంత్రి
పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం
సెప్టెంబరు 15 నుంచి బీటెక్‌ క్లాసులు

NIIT, JEE MAINS The Union Minister for announcing the new schedule


  • కాస్త ఆలస్యమైనా జేఈఈ, నీట్‌ ప్రవేశ పరీక్షలను నిర్వహించాలనే కేంద్రం నిర్ణయించింది. 
  • ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర సంస్థల్లో ఇంజినీరింగ్‌లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ రెండోవిడత మెయిన్స్‌ పరీక్ష ఈ నెల 18 నుంచి 23 వరకు జరగాల్సి ఉండగా.. దీనిని సెప్టెంబరు 1 నుంచి 6 తేదీల్లో నిర్వహింనున్నారు. 
  • ఆగస్టు 23న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను సెప్టెంబరు-27కు వాయిదా వేశారు. 
  • వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(నీట్‌) ఈ నెల 26న జరగాల్సి ఉండగా.. సెప్టెంబరు 13కు వాయిదా వేస్తూ కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. 
  • ఈ మేరకు కేంద్రమంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. 
  • దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు వాయిదా వేస్తున్నట్లు ఆయన వివరించారు.
  • పరీక్షలపై నిర్ణయం తెలిపేందుకు కేంద్రం గురువారం ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. 
  • కమిటీ శుక్రవారం సాయంత్రం నివేదిక సమర్పించింది. 
  • కమిటీ సిఫారసుల మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. 
  • కాగా..జేఈఈ మెయిన్స్‌కు 9 లక్షల మంది, నీట్‌కు 16.84 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.


నేటినుంచి పరీక్ష కేంద్రాల మార్పు

పరీక్షలు వాయిదా పడినందున..పరీక్ష కేంద్రాలు మార్చుకునేందుకు అవకాశం కల్పించింనట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) తెలిపింది. 
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న నీట్‌ అభ్యర్థులు ఈనెల 4 నుంచి 15 వరకు ఆన్‌లైన్లో కేంద్రాలను మార్చుకోవచ్చని ఎన్‌టీఏ డైరెక్టర్‌ జనరల్‌ వినీత్‌ జోషి చెప్పారు.

సెప్టెంబరు 15 నుంచి ఇంజనీరింగ్‌ తరగతులు


  • ఇంజనీరింగ్‌ విద్యా సంవత్సరం సెప్టెంబరు 15నుంచి ప్రారంభం కానుంది. 
  • ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) సవరించిన అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. 
  • దాని ప్రకారం..రెండు, మూడు, నా లుగో ఏడాది విద్యార్థుల తరగతులు ఆగస్టు 16 నుంచి ప్రారంభం కానున్నా యి. 
  • జూలై 15లోగా కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని ఏఐసీటీఈ నిర్ణయించింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "NIIT, JEE MAINS The Union Minister for announcing the new schedule"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0