There is no longer a library in every school
- 'విరామ' అభ్యసన
- ఇకపై ప్రతి పాఠశాలలోనూ గ్రంథాలయం ఏర్పాటు
- అందుబాటులోకి రూ.2.3 కోట్ల విలువ చేసే పుస్తకాలు
- త్వరలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు అందజేత
కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన నేపథ్యం
లో పాఠశాలలు పునఃప్రారంభంలో జాప్యం నెలకొంది. ఈ విరామ సమయంలో విద్యార్థుల్లో పఠనాసక్తి పెంచేందుకు
అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపట్టింది.
ఇందులో భాగంగా ప్రతి విద్యార్థి కనీసం ఐదు పుస్తకాలను విరామ సమయంలో చదివేలా ప్రోత్సహించాలంటూ ఉపాధ్యాయులకు
విద్యాశాఖ కమిషనర్ సూచించారు.
ఇందుకు అనుగుణంగా
ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న గ్రంథాలయాలకు సరఫరా చేసేందుకు అవసరమైన పుస్తకాలు
ఇప్పటికే సమగ్ర శిక్ష కార్యాలయానికి చేరుకున్నాయి. మరో
వారం రోజుల్లో వీటిని ఆయా పాఠశాలలకు అందజేయనున్నారు.
ప్రాథమిక పాఠశాలకు 30, ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలకు 50
చొప్పన పుస్తకాలు పంపిణీ చేయనున్నారు.
అభ్యసన సామర్థ్యాల పెంపు.
కరోనా నేపథ్యంలో పాఠశాలలు సకాలంలో
పునఃప్రారంభించనందుకు గాను పాఠ్యాంశాల్లో విద్యార్థులు వెనుకబడిపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా ఇప్పటికే దూరదర్శన్ సప్తగిరి ఛానల్ లో
పాఠ్యాంశాల బోధనను అందుబాటులోకి తీసుకువచ్చింది.
కాగా, విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు పుస్తక పఠనం అనివార్యం. దీంతో తాజాగా విద్యార్థులకు పుస్తకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది.
ప్రతి పాఠశాలకు రూ.6 వేలు విలువ చేసే పుస్తకాలను అందివ్వనున్నారు
పఠనా సామర్థ్యం, అభ్యసన నైపుణ్యాలు పెంపొందించడానికి వీటిని విద్యార్థులకు అందజేయనున్నారు.
0 Response to "There is no longer a library in every school"
Post a Comment