YSR AROGYASREE
2200 వైద్య ప్రక్రియలకు డాక్టర్ వైస్సార్ ఆరోగ్యశ్రీ వర్తింపు.
ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్య శ్రీ
గురువారం నుంచి 6 జిల్లాల్లో సేవలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు
మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ
గురువారం నుంచి 6 జిల్లాల్లో సేవలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు
మొత్తంగా 2200 వైద్య ప్రక్రియలకు ఆరోగ్య శ్రీ
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపును విస్తరిస్తూ సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీచేశారు. దీంతో గురువారం నుంచి కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వైద్యం ఖర్చు రూ.వేయి దాటితే ఆరోగ్యశ్రీ వర్తించనుంది. సోమవారం సీఎం జగన్ తన క్యాంపు కార్యాలయంలో ఆరోగ్యశ్రీ సీఈఓ డా.మల్లికార్జున్తో సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ పథకం అమలవుతున్న తీరుపై సీఎం ఆరా తీశారు. ఈ సందర్భంగా వెంటనే మరిన్ని జిల్లాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ
వైద్యం ఖర్చు వేయి రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీని వర్తింపు చేస్తామని జగన్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 3న పశ్చిమగోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు. అందులో భాగంగా అప్పటివరకూ ఉన్న 1,059 వైద్య ప్రక్రియలకు, కొత్తగా మరిన్ని చేరుస్తూ మొత్తం 2,059 రోగాలకు ఆరోగ్యశ్రీని వర్తింపు చేశారు. ఆ తర్వాత అనేక అంశాలను పరిష్కరిస్తూ ఆరోగ్యశ్రీ పటిష్టంగా అమలుకు విధానాలను రూపొందించారు. ఆ తర్వాత అమలయ్యే వైద్యప్రక్రియల సంఖ్యను 2,059 నుంచి 2146కు పెంచారు. ఆరోగ్యశ్రీ కింద సంపూర్ణ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మరో 54 వైద్యప్రక్రియలను కూడా అందిస్తున్నారు. మొత్తంగా 2,200 వైద్య ప్రక్రియలను ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.మీ ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని క్రింది లింక్ లో మీ ఆరోగ్యశ్రీ కార్డ్ స్టేటస్ ను చెక్ చేసుకోగలరు.
0 Response to "YSR AROGYASREE"
Post a Comment