Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP TEACHERS TRANSFERS-2020

హేతుబద్ధీకరణ ముసాయిదా సిద్ధం
నేడో రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం
హామీ మేరకు కేటాయించాలంటున్న ఉపాధ్యాయులు
AP TEACHERS TRANSFERS-2020

ఉపాధ్యాయుల బదిలీలు అనగానే ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి అనుగుణంగా హేతుబద్ధీకరణ చేయాల్సి ఉంటుంది. అందుకే ఏటా ఉద్యోగులకు సాధారణ బదిలీలు జరుగుతుండగా, ఉపాధ్యాయులకు మాత్రం ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందించి రెండు, మూడేళ్లకోసారి మాత్రమే బదిలీలు చేపడతారు. ప్రస్తుతం హేతుబద్ధీకరణకు సంబంధించిన ముసాయిదా సిద్ధమై బదిలీల ప్రక్రియకు అడుగులు పడుతున్నాయి.
ప్రాథమిక కసరత్తు పూర్తి
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బదిలీలకు ఆమోదం తెలపడంతో విద్యాశాఖ అధికారులు ప్రాథమిక కసరత్తు పూర్తిచేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర విద్యాశాఖ, జిల్లా, మండల విద్యాశాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముఖ్యమైన సూచనలు చేశారు. అందుకు సంబంధించిన ప్రొఫార్మాలు మండల స్థాయి నుంచి తీసుకున్నారు. గతంలో జరిగిన బదిలీల కంటే మరింత పారదర్శకంగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ సమాయత్తమవుతోంది.
కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు
ప్రతి పాఠశాలకు విద్యార్థుల నమోదుతో సంబంధం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులండాలని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలపటంతో 0-60 వరకు ఎంత మంది విద్యార్థులున్నా ఇద్దరు ఉపాధ్యాయులుండనున్నారు. హేతుబద్ధీకరణలో మిగులు ఎస్జీటీలను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నియమించనున్నారు.
గత మార్గదర్శకాలు మాదిరిగానే..
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నప్పటికీ ఆ దిశగా పోస్టులు మంజూరు చేయకుండా గతంలో హేతుబద్ధీకరణ చేసినట్లే ప్రస్తుతం చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి.

ప్రాథమిక పాఠశాలల్లో అరవై మంది విద్యార్థుల్లోపు ఇద్దరు ఉపాధ్యాయులు, 61-90 మంది ఉంటే ముగ్గురు, 91-120 మంది విద్యార్థులుంటే నలుగురు, 121 నుంచి 150 మందికి ఐదుగురు, 151-200 మందికి ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, ఐదుగురు ఎస్జీటీలు (6గురు) ఉంటారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ పోస్టు ఉన్న ప్రస్తుత పాఠశాలల్లో విద్యార్థుల నమోదు 150 కంటే తక్కువగా ఉంటే ఎస్జీటీగానే లెక్కిస్తారు.

ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో 20 మంది కంటే తక్కువ విద్యార్థులుంటే పాఠశాల సహాయకులను పక్కన ఉన్న ఉన్నత పాఠశాలకు బదలాయించనున్నారు.

ఉన్నత పాఠశాలల్లో గతంలో ఉన్న నిబంధనలే అమలు చేయనున్నారు. 200 మందిలోపు విద్యార్థులుంటే హెచ్‌ఎం, 8 ఎస్‌ఏలు, 50-200 (ఆంగ్లమాధ్యమం)లో నాలుగు ఎస్‌ఏ పోస్టులు అధనంగా ఇవ్వనున్నారు. 201 కంటే ఎక్కువ మంది ఆంగ్లమాధ్యమం విద్యార్థులుంటే ప్రత్యేక ప్యాట్రన్‌ ఇవ్వనున్నారు.
ఆంగ్ల మాధ్యమం పరిస్థితేమిటి?
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా 1నుంచి 5వ తరగతి వరకు నూతనంగా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంతో పాటు నూతన పాఠ్యపుస్తకాలు అందిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతుంటే ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని సంఘాలు వాపోతున్నాయి. 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులుంటే మూడో పోస్టు కాని, అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్‌లను నియమిస్తామని గతంలో ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ కమిషనరు హామీ ఇచ్చారని సంఘాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయిలో హేతుబద్ధీకరణ మార్గదర్శకాలు అందిన తర్వాత ప్రభుత్వాన్ని ఆ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా సంఘాలు కోరుతామంటున్నాయి.
40 మంది విద్యార్థులకు..
40 మందికి పైగా విద్యార్థులుంటే హామీ ఇచ్చిన విధంగా మరో పోస్టు మంజూరు చేయాలి. ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేసే పాఠశాల సహాయకుల పోస్టులను బదిలీ చేయకుండా చూడాలి. అప్పుడే విద్యాలక్ష్యం నెరవేరుతుంది. ఆ దిశగా విద్యాశాఖ చర్యలు చేపట్టాలి. -కె.హరిబాబు, ఏపీటీఎఫ్‌ జిల్లా కౌన్సిలర్‌
ప్రత్యేక ప్యాట్రన్‌ను నియమించాలి
ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమానికి ప్రత్యేక ప్యాట్రన్‌ను నియమించాలి. 50 మంది కంటే ఎక్కువ మంది ఉంటే ఆంగ్ల మాధ్యమాన్ని కొనసాగించాలి. 60 మంది వరకు ఇద్దరు ఉపాధ్యాయులంటే బోధనకు ఇబ్బంది కలుగుతుంది. అది పరిగణనలోకి తీసుకుని మరో పోస్టు ఇస్తే ఎక్కువ పాఠశాలలకు మేలు జరుగుతుంది. 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP TEACHERS TRANSFERS-2020"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0