AP Village Secretary Exams :
AP Village Secretary Exams : పరీక్షలకు కరోనా ఉన్న వారికి కూడా అనుమతి.
ఈ నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవు తున్నాయని..మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సమీక్షలో మంత్రి వివరించారు .
కరోనా నేపథ్యంలో సచివాలయ పోస్ట్ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్ల భర్తీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. 16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని..మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సమీక్షలో మంత్రి వివరించారు. 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు
మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలు...మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. కరోనా పాజిటీవ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన రూంలను సిద్దం చేశామని.. పిపిఈ కిట్లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్ నిర్వహిస్తారని అన్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్లో పాల్గొన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవు తున్నాయని..మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సమీక్షలో మంత్రి వివరించారు .
కరోనా నేపథ్యంలో సచివాలయ పోస్ట్ల భర్తీలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల పోస్ట్ల భర్తీపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. 16,208 ఖాళీ పోస్టులకు 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈనెల 20 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని..మొత్తం 7 రోజుల పాటు 14 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నామని సమీక్షలో మంత్రి వివరించారు. 20వ తేదీన 6,81,664 మంది పరీక్షలకు హాజరు కానున్నారు
మొదటి రోజు ఉదయం 2,221 కేంద్రాలు...మధ్యాహ్నం 1068 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు. కరోనా పాజిటీవ్ వున్న అభ్యర్ధులకు ఐసోలేషన రూంలను సిద్దం చేశామని.. పిపిఈ కిట్లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్ నిర్వహిస్తారని అన్నారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్లో పాల్గొన్న పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, పిఆర్ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ అడ్మినిష్ట్రేషన్ కమిషనర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
0 Response to "AP Village Secretary Exams : "
Post a Comment