Corona Test: No longer do corona tests do the same, the new rule of the central government.
Corona Test: ఇకపై కరోనా టెస్టులు ఇలా చేయండి, కేంద్రం కొత్త రూల్.
- కరోనా టెస్టులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
- కరోనా టెస్టులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
- కరోనా లక్షణాలు ఉన్న వారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే RT-PCR విధానంలో మరోసారి తప్పనిసరిగా టెస్టులు నిర్వహించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం సూచించింది
- ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో కరోనా లక్షణాలు ఉన్నవారికి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారని, అయితే, అందులో నెగిటివ్ వస్తే RT-PCR టెస్టులు చేయడం లేదని కేంద్రం దృష్టికి వచ్చినట్టు తెలిపింది.
- జ్వరం, దగ్గు, శ్వాస సమస్య లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే మళ్లీ RT-PCR టెస్టులు చేయాలి.
- ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టు చేసిన అసింప్టమాటిక్ కేసుల్లో రెండు, మూడు రోజుల తర్వాత మళ్లీ కరోనా లక్షణాలు కనిపిస్తే వారికి కూడా RT-PCR టెస్టులు చేయాలి.
- ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చింది కదా అని వదిలేస్తే కరోనా లక్షణాలు ఉన్నవారి ద్వారా మిగిలిన వారికి కూడా వ్యాపించే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది.
- అలా చేయడం వల్ల కరోనా బాధితులను త్వరగా గుర్తించవచ్చని, మరికొందరికి వ్యాపించే ప్రమాదాన్ని తప్పించవచ్చని కేంద్రం అభిప్రాయపడింది.
- కరోనా టెస్టుల్లో RT-PCR అనేది గోల్డ్ స్టాండర్డ్. దీన్ని గుర్తు పెట్టుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
0 Response to "Corona Test: No longer do corona tests do the same, the new rule of the central government."
Post a Comment