Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Will the PRC challenge the government?

పిఆర్‌సి సర్కారుకు సవాలు కానుందా?

Will the PRC challenge the government?

చర్చించాలి అని ఉన్నతాధికారులకు సిఎంఓ ఆదేశం.


పిఆర్ సి , కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం , సిపిఎస్ రద్దు , ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 50 శాతం జీతాలు , చాలాకాలం నుంచి బకాయి ఉన్న కరవుభత్యం అంశాలు ప్రభుత్వానికి సవాలుగా మారాయి . రోజురోజుకూ ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతుండడం , పరిష్కరించాల్సిన అంశాల విలువ వేల కోట్ల రూపాయలు దాటిపోతుండడంతో ఆర్ధికశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది . వీటి పై చర్చించేందుకు గాను ఒకటి రెండు రోజుల్లో కీలక సమావేశాన్ని నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది . ఈ నెలాఖరుతో పిఆర్ నివేదిక సమర్పించాల్సిన గడువు ముగిసిపోతోంది . ఇక పొడిగింపు అవసరం లేదని , నివేదిక ఇచ్చేస్తామని కమిషన్ చెబుతున్న నేపథ్యంలో దానిపై ఏమిచేయాలన్నది ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు . ఇప్పటికే రెండేళ్లు జాష్యంగా ఉన్న పిఆర్ సి అంశాన్ని ఇంకా ఆలస్యం చేస్తే ఉద్యోగుల నుంచి ఆందోళన ప్రారంభమయ్యే అవకాశాలుంటాయని అంచనా వేస్తోంది .

కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశం కూడా పెనుసవాల్ గా కనిపిస్తోంది . చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే నలుగుతున్న ఈ అంశంపై జగన్ గారు అనేక హామీలు గుప్పించారు . దీని పైనా ఉద్యోగుల నుంచి వత్తిడి ఎదురవుతోంది . కరోనా నేపథ్యంలో తొలి మూడు నెలలు ఉద్యోగులకు సగం జీతమే చెల్లించారు . తగ్గించిన జీతాన్ని 12 శాతం వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో సుప్రీం కోర్టుకు వెళ్లాలా , లేక వడ్డీతో జీతం చెల్లించాలా అన్నది కూడా ప్రభుత్వం తేల్చుకోలేకపోతోంది . ఉద్యోగులు , పింఛనుదారులకు ఇప్పటికే బకాయిపడిన మూడు విడతల కరవు భత్యాన్ని చెల్లించాలని , లేదంటే ఉద్యోగుల నుంచి వత్తిడి పెరుగుతుందని అధికారులు అంటున్నారు . చివరిగా సిపిఎస్ రద్దు అంశం . సిపిఎస్ ఒప్పందం నుంచి వైదొలగాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం , అందుకు అనుగుణంగా నిర్ణయాన్ని తీసుకోవడంలో తాత్సార ధోరణి అవలంభిస్తోంది . దీని పైనా ఇప్పటికే ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేశాయి . ఈ ఐదు అంశాలపై ప్రభుత్వం కొద్ది రోజులుగా దృష్టి సారిస్తోంది . వీటిపై లోతుగా అధ్యయనం చేయాలని ఆర్థికశాఖకు సూచించింది . ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి , ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలకు ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది .



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Will the PRC challenge the government?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0