Aadhaar does not want birth and death certificates: Central government
బర్త్ మరియు డెత్ సర్టిఫికెట్లకు ఆధార్ అక్కరలేదు :కేంద్రం ప్రభుత్వం
- బర్త్, డెత్ సర్టిఫికెట్లకు ఆధార్ అక్కర్లేదు... కేంద్రం
- కేంద్ర ప్రభుత్వం కొన్ని సర్టిఫికెట్లకు ఆధార్ కార్డు అవసరం తప్పనిసరి కాదని ప్రకటించింది.
- వాటిలో తాజాగా బర్త్, డెత్ సర్టిఫికెట్లు కూడా వచ్చి చేరాయి.
- తాజాగా ఈ సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్కు ఆధార్ అవసరం లేదని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) ప్రకటించింది.
- మరణ ద్రువీకరణ పత్రం రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలా అని విశాఖకు చెందిన అడ్వకేటు ఎంబీఎస్ అనిల్ కుమార్ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) ద్వారా అభ్యర్థించాడు.
- అతడి అభ్యర్థనకు ఆర్జీఐ స్పందిస్తూ.. జనన, మరణ ద్రువీకరణ కోసం ఆధార్ నెంబర్ అవసరం లేదని పేర్కొన్నది.
- 1969 నాటి రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(ఆర్బీడీ) చట్టం ప్రకారం ప్రస్తుతం జనన, మరణ ద్రువీకరణ కోసం రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు తెలిపింది.
- ఒకవేళ ఎవరైనా ఆధార్ను స్వచ్ఛంధగా సమర్పిస్తే, ఆ డాక్యుమెంట్ను డేటాబేస్లో స్టోర్ చేయరాదని తన సర్క్యూలర్లో పేర్కొన్నది
0 Response to "Aadhaar does not want birth and death certificates: Central government"
Post a Comment