AP EDCET-2020 Results
AP EDCET-2020 Results
ఎపి ఎడ్సెట్ 2020 ఫలితాలు నేడు విడుదలయ్యాయి.
అక్టోబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు.
శనివారం ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతి ప్రసాదరెడ్డి విశ్వవిద్యాలయంలోని ఐఎఎస్ఈ ప్రాంగణంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్సెట్-2020 ఫలితాలను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 15,658 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 10,363 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వీరిలో 10,267 మంది ఉత్తీర్ణత సాధించారని అన్నారు. మొత్తం 99.07 శాతం అభ్యర్థులు ఎడ్సెట్ కు అర్హత సాధించారని ప్రకటించారు. గణితంలో 99.74 శాతం, భౌతిక శాస్త్రంలో 99.41 శాతం, బయోలాజికల్ సైన్సెస్ లో 99.03, సాంఘిక శాస్త్రంలో 98.37, ఆంగ్లంలో 98.83 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని వెల్లడించారు.
0 Response to "AP EDCET-2020 Results"
Post a Comment