Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Call to unions from the CM’s office

సీఎం కార్యాలయం నుంచి ఉద్యోగ సంఘాలకు పిలుపు

Call to  unions from the CM’s office

  • బొప్పరాజు , వెంకట్రామిరెడ్డి సహచరులూ అక్కడే
  • ఎన్ జీ వో నాయకులకు సీఎం అపాయింట్మెంటు
  • ఏమైనా ప్రకటన ఉంటుందా? చర్చలకే పరిమితమా?

ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉద్యోగ సంఘాల నాయకులందరికీ పిలుపు వచ్చింది. ముఖ్యమంత్రి జగన్ అపాయింట్ మెంటు ఉండటంతో ఎన్ జీ వో సంఘం రాష్ర్ట అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి , బండి శ్రీనివాసరావు తదితరులు సీఎంవోకు వెళ్లారు. ఇంతలో మిగిలిన సంఘాల నాయకులకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో ఒక్క సారిగా ఉత్కంఠ రేగింది.  ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ర్ట అధ్యక్షులు సూర్యనారాయణ, గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ర్ట ఛైర్మన్  కె. వెంకట్రామిరెడ్డి, అమరావతి ఉద్యోగుల జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులకు కూడా ఫోన్లు వచ్చాయి. అయితే వెంకట్రామిరెడ్డి కడప జిల్లాలో తన సొంత ఊళ్లో ఉండటంతో సంఘం ప్రధాన కార్యదర్శిని సీఎం  కార్యాలయానికి పంపారు. ప్రస్తుతం ఉద్యోగ సంఘాల ముఖ్య నాయకులంతా  సీఎంవో కార్యాలయంలో ఉన్నారు.   ఉన్న సమాచారం మేరకు  ప్రస్తుతం ఎన్ జీ వో సంఘం నాయకులకు మాత్రమే ముఖ్యమంత్రి అపాయింట్ మెంటు ఉన్నట్లు తెలిసింది. మిగిలిన సంఘాల నాయకులను సీఎం కలుస్తారా లేక సీఎం కార్యాలయమే చర్చించి పంపుతుందా అన్నది ఇంకా సందేహమే.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వీరితో తొలుత కొన్ని అంశాలపై చర్చలకు పిలిచినట్లు తెలుస్తోంది. ఈయన కొన్ని అంశాలపై ప్రభుత్వ ఆలోచనలను వీరి ముందుంచే అవకాశం ఉంది.  దసరా నాటికి ప్రభుత్వం ఒక్క  డీఏ అయినా ప్రకటించే ఆలోచనతో ఉంది. ఉద్యోగ సంఘాలు కనీసం మూడు డీఏలు కోరుతున్నాయి. దీనిపై చర్చ జరిగే ఆస్కారం ఉంది.

మరో వైపు పెండింగు జీతాల చెల్లింపు పైనా చర్చ ఉండొచ్చు. హైకోర్టు 12శాతం వడ్డీతో చెల్లించమని చెప్పినందున ఉద్యోగ సంఘాల నుంచి ఇందుకు సంబంధించి మినహాయింపు కోరేలా కూడా  చర్చల్లో ప్రతిపాదన వచ్చే అవకాశం ఉంది.

మరో వైపు పీఆర్ సీపై కమిటీ విషయంలో ప్రభుత్వం తన  ఆలోచనను ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా వెల్లడించే ఆస్కారం ఉంది. డీఏ, పెండింగు జీతాల విషయంలో ఉద్యోగుల అభిప్రాయం తీసుకుని వారికి పరిస్థితి వివరించి తదనుగుణంగా ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించిన చర్చలు కొలిక్కి వస్తే వాటికి సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగ సంఘ నాయకులంతా సీఎం కార్యాలయంలోనే ఉన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Call to unions from the CM’s office"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0