The good news: Corona Peak phase is gone .. Completely over in 4 months
గుడ్ న్యూస్: కరోనా పీక్ దశ వెళ్లిపోయింది.. 4 నెలల్లో పూర్తిగా అంతం
కరోనా మహమ్మారితో వణికిపోతున్న ప్రజలకు శుభవార్త. దేశంలో ఫిబ్రవరి నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందట. వైరస్ వ్యాప్తి ఇప్పటికే పీక్ దశను దాటేసిందట. దేశంలో కొవిడ్-19 వ్యాప్తి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈ వివరాలు చెప్పింది. కొత్తగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని పేర్కొంది. ఇదే సమయంలో పండుగలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కమిటీ చెప్పిన కీలక వివరాలు:
- దేశంలో ప్రస్తుతం నెలకు సరాసరి 26 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా కేసుల్లో క్రమంగా తగ్గుదల కనిపిస్తోంది.
- దేశంలో ఇప్పటివరకు కేవలం 30 శాతం మంది మాత్రమే కరోనా వైరస్కు రోగనిరోధక శక్తి (Immunity) కలిగి ఉన్నారు.
- ప్రజలు కొవిడ్-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందే. నిబంధనలను కచ్చితంగా పాటిస్తే వచ్చే సంవత్సరం (2021) ప్రారంభంలో దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది.
- కరోనా అదుపులోకి వచ్చే నాటికి దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య కోటి ఐదు లక్షలకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ సంఖ్య 75 లక్షలుగా ఉంది.
- దేశంలో సెప్టెంబర్ 17 ఒక్క రోజే గరిష్టంగా 98 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు.
- కరోనా మహమ్మారి బారినపడి దేశంలో ఇప్పటివరకు 1.14 లక్షల మంది మరణించారు.
- వైరస్ అదుపులోకి వస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ ఆంక్షలను తొలగించి, అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వవచ్చు.
0 Response to "The good news: Corona Peak phase is gone .. Completely over in 4 months"
Post a Comment