PM Kisan: Rs 3,000 per month pension for farmers ... How to apply.
PM Kisan : రైతులకు నెలకు రూ .3,000 పెన్షన్ ... అప్లై చేసే విధానం.
రైతులకు శుభవార్త. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ పెన్షన్ స్కీమ్ అందిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పేరుతో ఈ పథకాన్ని కొంతకాలం క్రితం ప్రకటించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గతేడాది ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించింది. ఈ పెన్షన్ పథకాన్ని లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC నిర్వహిస్తోంది. ఇందులో చేరిన రైతులకు నెలకు రూ.3,000 పెన్షన్ లభిస్తుంది. ఇప్పటికే ఈ స్కీమ్లో 21 లక్షలకు పైగా రైతులు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ స్కీమ్లో రైతులు ఇప్పుడు కూడా చేరే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో రైతులకు ఆసరాగా నిలిచేందుకు ఈ పెన్షన్ స్కీమ్ ప్రకటించింది ప్రభుత్వం.
నెలకు రూ.3000 చొప్పున ఏడాదికి రూ.36,000 పెన్షన్ అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
రెండు హెక్టార్ల వరకు పొలం ఉన్న రైతులు ఎవరైనా ఈ పెన్షన్ స్కీమ్లో చేరొచ్చు. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకంలో చేరే రైతులు కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. పథకంలో చేరేనాటికి వయస్సును బట్టి రూ.55 నుంచి రూ.200 మధ్య ప్రీమియం ఉంటుంది. అంటే 18 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి. ప్రతీ నెల ప్రీమియం చెల్లించాలి. రైతులు ఎంత ప్రీమియం చెల్లిస్తారో అంతే సమానంగా ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. రిటైర్మెంట్ వయస్సు నుంచి రైతులకు నెలకు రూ.3,000 చొప్పున పెన్షన్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్న రైతులు ఈ స్కీమ్లో చేరొచ్చు. స్కీమ్లో చేరిన నాటి నుంచి 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి. సరిగ్గా 60 ఏళ్లు దాటగానే వారికి నెలకు రూ.3000 పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ రైతు మరణిస్తే అతని భార్యకు 50% ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది.
ఈ స్కీమ్లో చేరాలనుకునే రైతులు దగ్గర్లోని కామన్ సర్వీస్ సెంటర్-CSC కు వెళ్లి దరఖాస్తు చేయొచ్చు. బ్యాంక్ పాస్బుక్, ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఈ స్కీమ్లో చేరడానికి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజనలో చేరిన తర్వాత ప్రతీ నెలా ప్రీమియం చెల్లించాలి. నేషనల్ పెన్షన్ స్కీమ్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ స్కీమ్, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లాంటి ఇతర సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో ఉన్నవారికి ప్రధాన మంత్రి కిసాన్ మాన్ధన్ యోజన వర్తించదు.
How to apply for this
ReplyDelete