Redistribution of teacher allocations according to the number of students in public schools
టీచర్ల పునర్విభజన కసరత్తు ప్రారంభం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపులకు సంబంధించిన పునర్విభజన
కసరత్తు బుధవారం ప్రారంభమైంది.
విద్యార్థులు తక్కువగా ఉన్న స్కూలులో ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో ఉన్నారు.
పిల్లలు ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో వారికి బోధించేందుకు తగినంత మంది టీచర్లు లేరు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం పునర్విభజన ప్రక్రియను చేపట్టింది. చైల్డ్ ఇన్ఫో ఆధారంగా టీచర్ పోస్టులు కేటాయిస్తారు.
మొదట ఈనెల 2 నాటికి ఉన్న సమాచారం ఆధారంగా ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశాలు రాగా సర్వర్ సమస్య వల్ల 3వ తేదీ సాయంత్రం వరకు విద్యార్థుల వివరాలు యూ డైలో నమోదు చేసేందుకు సమయాన్ని ఇచ్చారు.
9వ తేదీలోపు టీచర్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసి, 10,11 తేదీల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో యాజమాన్యాలు కేటగిరీ, సబ్జెక్టు వారిగా ఖాళీల వివరాలను వెబ్ సైట్లో ఉంచాలని ఆదేశించారు.
టీచర్లు అందరూ పాఠశాలలకు హాజరుకావాలి
ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల
ఆధ్వర్యంలోని అన్ని పాఠశాలల ఉపాధ్యాయులందరూ ప్రతిరోజు తప్పనిసరిగా స్కూళ్లకు హాజరుకావాలని పాఠశాల విద్య డైరెక్టర్ చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రాథమిక, యూపీ స్కూలు టీచర్లు విధిగా రెండు పూటల బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించారు.
అలాగే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులకు డిప్యుటేషన్ వేయాలని ఎంఈవోలను ఆదేశించారు.
ఈనెల 21వ తేదీ వరకు వారి సేవలను వినియోగించుకోవాలన్నారు.
ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీగ్రేడ్ టీచర్లను కూడా డిసెంబరు 10 వరకు ఉన్నత పాఠశాలలకు
డిప్యుటేషన్ వేయాలని చెప్పారు.
0 Response to "Redistribution of teacher allocations according to the number of students in public schools"
Post a Comment