AP: 10th class public exams in the month of May .. full details ..!
AP: మే నెలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు.. పూర్తి వివరాలివే..!
SSC EXAMS 2021: ఏపీలో పదో తరగతి పరీక్షలపై స్పష్టత వచ్చింది.
ఏపీలో పదో తరగతి పరీక్షలపై స్పష్టత వచ్చింది. 2021 మే నెలలో ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు జరిగే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి తెలిపారు. అలాగే ఏప్రిల్ 30 వరకు క్లాసులు ఉంటాయని పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020లో పదో తరగతితో పాటు ఇతర పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరగలేదన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం ఉండటంతో 2021 లో జరగాల్సిన పరీక్షలపై విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.
ఏపీ టెన్త్ ఎగ్జామ్స్ 2021
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ స్కూళ్లకు చెందిన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లతో ప్రతాప్ రెడ్డి ఆన్లైన్ మీటింగ్ నిర్వహించారు. పలు పరీక్షలపై ఉన్న అనుమానాలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ మేలో ఉంటాయని తెలిపిన ప్రతాప్ రెడ్డి.. ఎన్ని పేపర్స్ ఉంటాయనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని కోరారు.
ఫార్మేటివ్ పరీక్షలు ఎప్పుడంటే..?
ఇక జనవరి 6, 7, 8 తేదీల్లో 9, 10వ తరగతుల విద్యార్థులకు, జనవరి 21, 22, 23 తేదీల్లో 7, 8 తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్-1 ఎగ్జామ్స్ ఉంటాయన్నారు. అన్నీ స్కూళ్లలో ఏప్రిల్ 30 వరకు తరగతులు నిర్వహించి సిలబస్ పూర్తి చేయాలని చెప్పారు. సాధారణంగా ప్రతీ ఏడాది ఈ సమయానికే 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలవుతుంది. కానీ ఈసారి కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇంకా టెన్త్ ఎగ్జామ్ తేదీలు ఖరారు కాలేదు.
0 Response to "AP: 10th class public exams in the month of May .. full details ..!"
Post a Comment