Full Scholarship to study after Tent.
టెన్త్ తర్వాత చదువుకు పూర్తి స్కాలర్ షిప్.
దళిత విద్యార్థులకు వరం..
కేంద్ర కేబినెట్ నిర్ణయం..
న్యూఢిల్లీ , ఆంధ్రప్రభ : దళిత విద్యార్థులకు అందజేస్తున్న పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్ పథకంలో భారీ మార్పులను కేంద్రం తీసుకొచ్చింది . ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతనసమావేశమైన ఆర్థిక వ్యవహారాలకేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది . ఈ నిర్ణయంతో రానున్న ఐదేళ్లలో 4 కోట్ల మంది దళిత విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించే వెసులుబాటు కలుగుతుం దని కేంద్రం పేర్కొంది . రూ . 59,048 కోట్ల పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొస్తుండగా , ఇందులో 60 శాతం అంటే రూ . 35,534 లోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది . మిగతాది రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాగా జోడించాల్సి ఉంటుంది . 10 వ తరగతి పూర్తిచేసుకున్న దళిత విద్యార్ధులు లపై విద్యాభ్యాసాన్ని కొనసాగించేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది . వారి విద్యాభ్యా సానికయ్యే వ్యయం పూర్తిగా స్కాలర్లో భరించేలా పథకం ఉందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది . అలాగే ఈ పథకాన్ని పూర్తిగా ఆన్లైన్ విధానంలో అమలు చేస్తామని , ఇప్పటి వరకు అమల్లో ఉన్న విధానానికి భిన్నంగా డైరెక్ట్ టెనిఫిట్ ట్రాన్సఫర్ ( డీబీటీ ) విధానంలో నేరుగా విద్యార్ధుల ఖాతాల్లోకి స్కాలర్ షిప్ సొమ్ము జమచేసేలా మార్పులు తీసుకొచ్చినట్టు కేంద్రం వెల్లడించింది .
0 Response to "Full Scholarship to study after Tent."
Post a Comment